DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేటి నుంచి దీపాలి పటేల్ చే భాగవత పారాయణం 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 27, 2021 (డిఎన్ఎస్):* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* ప్రముఖ గాయని రాజ్ కోట్ కు చెందిన దీపాళి దీదీ వీధి భాగవత కథ పారాయణం మహా విశాఖ నగరంలో శ్రీ గుజరాతీ సమాజం లో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు హేమచంద్ర చాక్షి తెలిపారు. సెప్టెంబర్ 26వ తేదీ నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు మహారాణి పేటలో గల

రాజస్థానీ సంస్కృతి మండలిలో భాగవతం పారాయణం జరుగుతుందన్నారు. శోభాయాత్ర ఆదివారం జిల్లా పరిషత్ సమీపంలోని శ్రీకృష్ణ మందిరం వద్ద మొదలై రాజస్థాన్ సాంస్కృతిక మండలి వరకూ సాగింది.  శోభా యాత్రలో  పారాయణం చేసే భక్తులు శిరస్సు పై భాగవత గ్రంథం ఉంచి యాత్రలో పాల్గొన్నారు. 
పోతీ యాత్ర అనంతరం గణపతి పూజ నిర్వహించి తరువాత

ఆచార్య దీపాళి పారాయణం ప్రారంభిస్తామని అన్నారు. రెండవ రోజు పారాయణం, మూడవ రోజున పుష్పాలతో హోలీ పండగ ఉంటుందని తెలిపారు. నాలుగో రోజైన 29వ తేదీన వామన, శ్రీరామ, శ్రీకృష్ణ జననం, 30వ తేదీన గిరి రాజు ఉత్సవం, అక్టోబర్ ఒకటో తేదీన శ్రీకృష్ణ, రుక్మిణి  వివాహం, చివరి రోజైన రెండవ తేదీన పరి సమాప్తి ఇలా పారాయణం సాగుతుందని ఆయన

వివరించారు. రోజూ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పారాయణం ఉంటుందన్నారు. అనంతరం  ప్రసాద వితరణ జరుగుతుందని చెప్పారు. 
శ్రీమద్ భాగవతం పారాయణం అనంతరం  వచ్చే నెల మూడవ తేదీన శ్రీ గుజరాతి సమాజం యండాడలో  నిర్వహిస్తున్న భవనం ప్రాంగణంలో శాంతి పూజలు నిర్వహించడంతో కార్యక్రమం ముగుస్తుందన్నారు.

మార్వాడీలు గుజరాతీలు ఎంతో భక్తి శ్రద్ధలతో పితృ దేవతలకు శ్రీమద్ భాగవత కథ పారాయణం చేస్తారని తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam