DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ఏసీ శాంతిని బదిలీ చేసేదాకా ఉద్యోగాలు చేయం 

*దేవదాయ శాఖ ఏసిపై కార్యాలయ క్లాస్ 4 ఉద్యోగుల నిరసన*

*నిజాలు చెప్పినందుకే కక్ష సాధింపు: కమిషనర్ కు లేఖ* 

*(DNS report : సత్య గణేష్ BVS, స్టాఫ్ రిపోర్టర్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 27, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ దేవదాయ శాఖ లో తొలిసారి ఒక సహాయ కమిషర్ పై అదే  కార్యాలయ క్లాస్ 4 ఉద్యోగుల నిరసన

తెలియచేయడం తొలిసారి. విశాఖపట్నం లోని సహాయ కమిషనర్ కె. శాంతిని  బదిలీ చేసే వరకూ విధుల్లో కొనసాగేది లేదు అంటూ ఉద్యోగులు సామూహిక సెలవులోకి వెళ్లారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు లేఖ వ్రాసారు. సోమవారం జరిగిన ఈ ఘటనతో అందరూ నిర్గాంతపోయారు. శాంతి తమపై కక్ష సాధింపు చేస్తున్నారని, సెలవులో కూడా ఉద్యోగాలు

చెయ్యాలంటూ వేధిస్తున్నారన్నారు. శాంతిని బదిలీ చేసే వరకు తాము విధుల్లో చేరబోమని స్పష్టం చేశారు. 

రాజకీయ అండదండలు  చూసుకొని శాంతి తమను అనేక విధాలుగా హింసిస్తున్నారని అన్నారు. భర్తలు మరణించాక కారుణ్య నియామకాల్లో తమను ఉద్యోగాల్లో నియమించారని తెలిపారు.  అంకిత భావంతో పనిచేస్తున్న తమను హేయ భావంతో

చూస్తూ సూటి పోటు మాటలు అంటూ సస్పెండ్ చేస్తానని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. సెలవు దినాల్లో కూడా పనిచేయిస్తున్నారని కుటుంబ జీవనం సాగించలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. శాంతిని బదిలీ చేయక పొతే ఆత్మహత్యలే శరణ్యమన్నారు. 

ఇటీవల ఉపకమీషనరు పై ఇసుక చల్లిన ఘటనపై విచారణ నిమిత్తం

అధికారులు విశాఖపట్నం వచ్చినప్పుడు మమ్మల్ని కూడా వివరణ ఇమ్మనమని కోరడం జరిగిందన్నారు. దీనిపై మా అభిప్రాయలు లిఖితపూర్వకముగా తెలియజేసామన్నారు.  దీనిపై ఏసీ శాంతి మీ అందరూ నాపై అధికారి వారికి ఫిర్యాదు చేస్తారా అంటూ ఇబ్బందికర వాతావరణం కల్పించారన్నారు. 

ఈ నిరసనల్లో సహాయ కమిషనర్ కార్యాలయం ఉద్యోగులు గౌరీ,

లక్ష్మి, ప్రభ, ఉమా దేవి, రాజశేఖర్, భాను తదితర ఉద్యోగులు మీడియా వద్ద తమ ఇబ్బందులు వివరించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam