DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గులాబ్ తుఫాన్ లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

*పద్మనాభం బీజేపీ ప్రధాన కార్యదర్శి మహంతి శ్రీనివాసరావు* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 27, 2021 (డిఎన్ఎస్):* గులాబ్ తుఫాన్ ప్రభావంగా భారీ మొత్తంలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ    పద్మనాభం మండలం ప్రధాన కార్యదర్శి మహంతి శ్రీనివాసరావు కోరుతున్నారు.

ముఖ్యంగా పద్మనాభం మండలంలో రైతులు పొలాల్లో వేసిన వరి, మామిడి, అరటి, కంద తోటలు బాగా నష్టపోయాయని, వాటికి కలిగిన పంట నేస్తాన్ని అధికారులు అంచనా వేసి, రైతులకు నష్టపరిహారం  అందించాలని కోరారు. అదే విధంగా ప్రభుత్వం ప్రకటించిన విధంగా బాధితులకు సత్వరం వెయ్యి రూపాయల పరిహారం అందించాలన్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్య,

మంచినీటి కొరత ఎక్కువగా ఉంది. తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam