DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గులాబ్ తుపాను బాధితులను ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్ 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 28, 2021 (డిఎన్ఎస్):* గులాబ్ తుపాను సృష్టించిన బీభత్సం, భారీ వర్షాల వల్ల కారణంగా బాధితులైన వారిని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి, కృష్ణా జిల్లా వరకూ అతలాకుతలమైందని,  లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి...

వేలాది ఇళ్ళల్లోకి నీళ్ళు ప్రవేశించి జనజీవనం అస్తవ్యస్తం కావడం బాధాకరం అన్నారు.  బాధిత కుటుంబాలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయం దెబ్బ తినడంతో ప్రజలు అంధకారంలో ఉన్నారు. వీలైనంత త్వరగా విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలను పునరుద్ధరించాలని సంబంధిత శాఖలకు

విజ్ఞప్తి చేస్తున్నాం. జనసేన నాయకులు, శ్రేణులు తమ పరిధిలో బాధితులకు సహాయపడాలని కోరుతున్నారు. 
ప్రకృతి విపత్తులకు నష్టపోయే వర్గం రైతాంగమే. అప్పులు చేసి, కాయకష్టంతో సాగు చేసే రైతులు తుపాన్లు, భారీ వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బ తింటున్నారు. గులాబ్ తుపాను మూలంగా సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు

తెలిసింది. ఎక్కువ మేర వరి దెబ్బతింది. పంట నష్ట పరిహారం లెక్కించడంలో ప్రభుత్వం అనుసరించే విధానాలు మారితేనే రైతులకు మేలు జరుగుతుంది. నామ మాత్రపు సాయంతో సరిపెడితే ప్రయోజనం ఉండదు. నివర్ తుపాను సమయంలో పంటలు దెబ్బ తిన్న ప్రాంతాల్లో పర్యటించినప్పుడు రైతులు, కౌలు రైతుల ఆవేదన స్వయంగా తెలుసుకున్నాను. ఎకరానికి రూ.25 వేలు

నుంచి రూ.30 వేలు వరకూ పరిహారం ఇస్తేనే రైతులు కోలుకోగలరు. ఈ దిశగా ఇప్పుడైనా ఆలోచన చేయాలన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam