DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పద్మనాభంలో గృహ సంపర్క్ అభియాన్ విస్తృత ప్రచారం 

*పద్మనాభం బీజేపీ ప్రధాన కార్యదర్శి మహంతి శ్రీనివాసరావు* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 28, 2021 (డిఎన్ఎస్):* భారత ప్రధాని నరేంద్ర మోడీ, జన్మదినోత్సవం వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహ సంపర్క్ కార్యక్రమం ను పద్మనాభం మండలంలో గృహ సంపర్క్ అభియాన్ కార్యక్రమం

ను విస్తృతంగా ప్రచారం చేసినట్టు భారతీయ జనతా పార్టీ పద్మనాభం మండల ప్రధాన కార్యదర్శి, మహంతి అప్పల రమణ (శ్రీనివాసరావు) తెలిపారు. మంగళవారం ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు, పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గాడి తప్పుతున్న

భారతదేశాన్ని, గాడి లో పెట్టి, ప్రపంచ దేశాలకే విశ్వ గురువుగా భారతదేశాన్ని అగ్రస్థానం లో నిలబెట్టిన ఘనత ఆధునిక భారత నిర్మాత నరేంద్ర దామోదర్ దాస్ దే నన్నారు.
ఈ నెల 17 నుంచి జరుగుతున్న ఈ వేడుకలు 20 రోజుల పటు జాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా విస్తారక్  ఉప్పాడ అప్పారావు, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి

పివివి ప్రసాదరావు,  తివనాన ఎల్లయ్య, కార్యకర్తలు తదితరులు  పాల్గున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam