DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ మెయిన్ రోడ్డుపై గొయ్యిని పూడ్చిన ట్రాఫిక్‌ ఎస్ఐ

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 29, 2021 (డిఎన్ఎస్):* ప్రభుత్వ - కాంట్రాక్టర్ల సమన్వయ లోపం కారణంగా విశాఖ మహా నగరంలోని మెయిన్ రోడ్లన్నీ అడుగుల లోతు గోతులమయంగా మారిపోయాయి. అయితే ప్రజలు ఎన్ని ఫిర్యాదులు చేసిన, మీడియా లో ఎన్ని కధనాలు వచ్చినా ప్రభుత్వం, అధికులు, ప్రజాప్రతినిధుల పని తీరు

దున్నపోతు మీద వాన పడినట్టుగానే ఉంది. 
అయితే ఇదే అత్యంత ఘోరమైన దుస్థితి ఉన్న విశాఖపట్నం ప్రధాన రహదారుల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ప్రజల అవస్థలు చూడలేక తామే రంగంలోకి దిగారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగర రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. విశాఖ

పట్నంలోని మెయిన్ రోడ్డులో గల పూర్ణామార్కెట్ దగ్గర కూడలి లో గోతులు అడుగుల లోతు లో ఉన్నందున వాహనదారులు పడిపోయి ప్రమాదాలకు గురి అవుతుండడంతో మంగళవారం అక్కడే విధుల్లో ఉన్న విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ ఎన్ వి భాస్కర రావు తన సిబ్బందితో కలిసి పూడ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రహదారులపై గుంతలు, మరమ్మతులు,

విభాగినులు, బ్యారికేడ్లు ఇలా వివిధ కారణాలతో ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్‌స్పాట్లను గుర్తించమన్నారు. ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న పనితో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్ఐ పక్కి గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam