DNS Media | Latest News, Breaking News And Update In Telugu

1 న రాజమండ్రిలో చిరంజీవిచే అల్లు విగ్రహవిష్కరణ 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 29, 2021 (డిఎన్ఎస్):* ప్రముఖ హాస్య నటులు అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని అక్టోబర్ 1 న రాజమండ్రిలో హోమియో కళాశాల లో ప్రారంభించనున్నారు.  హోమియో కళాశాల స్థాపించి మూడు దశాబ్దాలు గా ఉచిత  వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోనికి తెచ్చిన ఘనత డాక్టర్ అల్లు

రామలింగయ్య దే. 
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించే ఈ హోమియో వైద్యకళాశాల గోదావరి తీరంలో హోమియో రోగులకు వరంగామారింది. ఈ కళాశాల లో ప్రధాన ద్వారం వద్ద సినీ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన డాక్టర్ అల్లు రామలింగయ్య నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి

ఆవిష్కరించనున్నారు. ఎంపి గా ఆయన కేటాయించిన రూ రెండు కోట్ల నిధులతో నిర్మించిన తరగతుల భవనాన్ని రాజమహేంద్రవరం ఎంపి మార్గాని భరత్ రామ్ ప్రారంభిస్తారు. 
ఈ కార్యక్రమం లో మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తదితరులు హాజరుకానున్నట్టు హోమియోపతి కళాశాల ప్రిన్సిపాల్ సూర్య భగవాన్

తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam