DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జడ్పి స్కూల్లో గాంధీ జయంతి, విద్యార్థులకు పోటీలు 

*బీజేపీ నేత ప్రసాదరావు నేతృత్వంలో వేడుకలు*  

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 01,  2021 (డిఎన్ఎస్):* మహాత్మా గాంధి 152 వ జయంతి సందర్భంగా ఆనందపురం మండలం లో గొట్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు, వ్యాసరచన పోటీలు నిర్వహించినట్టు బీజేపీ బిజేపి జిల్లా  కిసాన్ మోర్చా

చైర్మన్ పి.వి.వి. ప్రసాదరావు  పట్నాయక్ తెలియచేసారు. శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమం లో బహుమతులను పంపిణీ చేశారు. 

ఈ కార్యక్రమాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఆర్. సన్యాసిరావు ఆధ్వర్యంలో, విద్యార్థులకు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాంధీ జీవిత చరిత్ర,

విద్యార్థులకు అనేక ప్రశ్నలు అడగ్గా, క్లుప్తంగా సమాధానం చెప్పారు, గొట్టి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఎక్కువ మంది విద్యార్థులు ఉండడంతో, స్కూల్, అభివృద్ధి, ఉపాధ్యాయల తో, సాధ్యమైందని, స్కూల్ అభివృద్ధికి పాటుపడిన, ప్రధాన ఉపాధ్యాయులతో పాటు, ఉపాధ్యాయ బృందంని, ధన్యవాదాలు తెలిపారు. అన్ని గ్రామాల్లో, ఈ విధంగా, స్కూల్

అభివృద్ధికి, ఉపాధ్యాయులు కృషి అవసరమని అన్నారు. 

ఈ కార్యక్రమంలో గొట్టి పల్లి గ్రామం బిజేపి జిల్లా  కిసాన్ మోర్చా కార్యదర్శి బుత్తల రాజు,  గ్రామ సర్పంచ్, గంట జగదీశ్వరావు, స్కూల్ చైర్మన్, దొంతల కనక రాజు, సత్య సాయి బజాన మండలి కన్వీనర్, కోరాడ తమ్ము నాయుడు, వైస్ చైర్మన్ కోరాడ రాణి, ఎంపిటిసి, దొంతల కనక రాజు,

బిజేపి నాయకులు,గండి లక్ష్మి రావు, ఉపాధ్యాయులు, బి. అప్పారావు, లలిత, మరియు, ఉపాధ్యాయ బృందం, పాల్గొన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam