DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రి లో పవన్ కు అడుగడుగునా అడ్డంకులే.

*సభా వేదిక పూర్తిగా బంద్, క్యారీ రోడ్డులోకి మారిన సభ*  

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 02,  2021 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో శ్రమదానంలో పాల్గొనేందుకు శనివారం వచ్చిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి పోలీసులు అడుగడుగునా ఆంక్షలు

విధించారు. రాజమండ్రి నగరాన్ని అష్టదిగ్భందనం చేశారు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి నగరంలోకి  వస్తున్నాపవన్ కు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఈ పర్యటన నేపధ్యంలో రాజమండ్రిలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. రాజమండ్రి నగరాన్ని అష్టదిగ్భందనం చేశారు.

రాజమండ్రి వైపు వచ్చే వాహనాలపై తీవ్రమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. సభా ప్రాంగణానికి చేరుకునే దారులన్నీ పోలీసులు మూసివేశారు. సభకు ఇరు వైపులా సుమారు 5 కిలోమీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి.
కాలినడకన కూడా కార్యకర్తలను సభా ప్రాంగణం వైపు వెళ్లనివ్వడం లేదు. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి వాహనాలను సైతం

లోనికి అనుమతించడం లేదు. 
పోలీసులు ఇప్పటికే వేలాది మంది జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు, నలుగురు కలసి ఒక చోట ఉన్నా, నడిచి వెళ్తున్నా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపధ్యంతో రాజమండ్రి నగరాన్ని తీవ్ర ఆంక్షలతో అష్టదిగ్భందనం

చేశారు. 

రాజమండ్రి క్వారీ సెంటర్‌లో పవన్ కల్యాణ్‌ను అడ్డుకున్న పోలీసులు, వాగ్వివాదం.. కారు టాప్‌పై కూర్చొని పోలీసులకు వ్యతిరేకంగా పవన్‌ కల్యాణ్ నినాదాలు చేయడం తో పోలీసులు వెనక్కి తగ్గారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam