DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వాల్తేర్ కెవిలో హర్షిత్ విద్యా ప్రతిభా పురస్కారాల అందజేత

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 02,  2021 (డిఎన్ఎస్):* విశాఖపట్నం లోని వాల్తేర్  కేంద్రీయ విద్యాలయలో హర్షిత్ వార్షిక విద్యా ప్రతిభా అవార్డులు, నగదు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. కొవిడ్ కారణంగా వాయిదా పడిన అవార్డులను 2019-20, 2020-21 విద్యా సంవత్సరాలకు ప్రతిభావంతులైన ప్రాధమిక పాఠశాల

విద్యార్ధులకు ప్రదానం చేశారు. చదువు, ఇతర సహ పాఠ్యాంశాలు, క్రీడలు, చురుకుదనం వంటి అన్ని అంశాలనుపరిగణన లోకి తీసుకుని ప్రతి తరగతిలోని ఇద్దరు విద్యార్ధులను కేంద్రీయ విద్యాలయ వాల్తేర్ పరీక్షల విభాగం ఎంపిక చేసింది. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్ధిని విద్యార్ధులు పది మంది ఈ నగదు పురస్కారాలకు ఎంపికయ్యారు.

ప్రతి ఏటా పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఈ అవార్డులు అందిస్తారు. రెండేళ్లుగా కొవిడ్ కారణంగా పాఠశాల వార్షికోత్సవం నిర్వహించడం లేదు. కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ మాస్టర్ హర్షిత్ జన్మదినం పురస్కరించుకుని గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతిల సందర్భంగా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అవార్డులకు ఎంపికైన

విద్యార్ధినీ విద్యార్ధులు ఒక్కొక్కరుగా వచ్చి ప్రశంసాపత్రాలను, నగదు బహుమతిని స్వీకరించారు. 

వాల్తేర్ కేంద్రీయవిద్యాలయ ప్రిన్స్ పల్ ఎస్ ఎస్ రాజా, హర్షిత్ తల్లిదండ్రులు గౌరీ కుమారి, కూర్మరాజు  (సీనియర్ పాత్రికేయులు) ల సమక్షంలో వీటిని విద్యార్ధినీ విద్యార్ధులకు ప్రదానం చేశారు. కెవి ప్రాధమిక పాఠశాల

విభాగం ప్రధానోపాధ్యాయురాలు రేఖ, ఉపాధ్యాయురాలు వాణిలు పాల్గోన్నారు. ఈ సందర్భంగా ప్రిన్స్ పాల్ ఎస్ ఎస్ రాజా మాట్లాడుతూ ప్రతిభావంతులైన పిల్లలను ప్రోత్సహించడం ద్వారా హర్షిత్ తల్లిదండ్రులు ప్రతి విద్యార్ధిలోనూ తమ చిన్నారిని చూసుకోవడం అభినందించదగ్గ అంశమన్నారు. 

హర్షిత్ తండ్రి సీనియర్ పాత్రికేయులు ఎం

కూర్మరాజు మాట్లాడుతూ ఇదే పాఠశాలలో నాల్గో తరగతి చదువుతూ 2017 ఏప్రిల్ 25న వడదెబ్బ కారణంగాతమ అబ్బాయి హర్షిత్ పాఠశాల ప్రార్ధన జరుగుతున్న సమయంలో కుప్పకూలిపోయాడని గుర్తుచేసుకున్నారు. 2017-18 నుంచి హర్షిత్ పేరిట ప్రతి ఏటా ఇరవై వేల రూపాయిల నగదు అవార్డులను ప్రతిభావంతులైన పిల్లలకు అందిస్తున్నామన్నారు. పాఠశాల ఎగ్జామినేషన్

విభాగం నిర్ణయించిన ప్రతిభావంతులైన బాలబాలికలకు తమ అబ్బాయి హర్షిత్ పేరిట అవార్డులను ఇస్తున్నామని వివరించారు. వీటిని శాశ్వత ప్రాతిపదికన ప్రతి ఏటా ఇచ్చే ఏర్పాటు చేశామన్నారు. చదువుతో పాటు అన్నింటిలోనూ హర్షిత్ ముందుండేవాడని ఉపాధ్యాయులు రేఖ, వాణిలు గుర్తు చేసుకున్నారు. 

విజేతలు వీరే: 

హర్షిత్

విద్యా ప్రతిభా పురస్కారాలను  2019-20 సంవత్సరానికి గాను ఒకటో తరగతిలో ఫైజల్ అహ్మద్ షరీఫ్, ఎ.అవినాష్, రెండో తరగతి నుంచి కావ్య యష్, కె.ఛరిష్మా లు, మూడో తరగతి నుంచి ఆస్తా ఠాకూర్, స్తుతి ప్రియ, నాల్గో తరగతి నుంచి గాయత్రి ప్రియదర్శిని సాహు, సౌమల్యా దత్తా, ఐదో తరగతి నుంచి సంజీబన్ కలిత, ఎన్ కెఎస్ లాస్య లు నగదు బహుమతులు

అందుకున్నారు. 
2020-21 సంవత్సరానికి గాను ఒకటో తరగతి నుంచి బి.యశస్వి,ఎన్.మిఖిల్ రావు, రెండో తరగతి నుంచి ఆర్.వి.పి.గీత శ్రీ, శృతి సుమన్ సాహు, మూడో తరగతి నుంచి మయూరి రాయ్, కె.మోక్షలేఖ్య, నాల్గో తరగతి నుంచి పి. భావన, సాయి ప్రణతి, ఐదో తరగతి నుంచి డి.శ్రావణ్ చంద్ర, ఎస్.కె. అదా జిబా లు నగదు బహుమతులు లభించాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam