DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నవోదయ స్కూల్లో 21 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, అక్టోబర్ 02, 2021 (డిఎన్ఎస్):* పెద్దాపురం నవోదయ స్కూల్లో 21 మంది విద్యార్థినీ విద్యార్థులకు కరోనా పాజిటివ్  రిపోర్టు వచ్చినట్లు పెద్దాపురం ఆర్డీవో ఎస్ మల్లిబాబు శనివారం  విలేకర్ల సమావేశంలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశం మేరకు ర్యాండమ్ టెస్ట్ లో భాగంగా

 రెసిడెన్షియల్ విద్యార్థులకు కరోనా టెస్ట్ లు  శుక్రవారం నుండి ప్రారంభించడం జరిగిందని తెలిపారు.  ఇందులో భాగంగా పెద్దాపురం నవోదయ స్కూల్ లో 70 మందికి కరోనా పాజిటివ్ పరీక్షలు చేయగా వీటిలో 21 మందికి కరోనా పాజిటివ్ గా రిపోర్ట్ రావడం జరిగిందని ఆర్డిఓ తెలిపారు. వీరిలో 16 మంది బాలికలు ఐదుగురు బాలురు లు ఉన్నారని చెప్పారు.

కరోనా పాజిటివ్ వచ్చిన పిల్లలు ఎవరికి దగ్గు, జలుబు ,జ్వరము, ఒళ్ళు నొప్పులు తదితర  కరోనా రోగ లక్షణాలు లేవని చెప్పారు.  ఆరోగ్యంగానే ఉన్నారని, పిల్లల  తల్లిదండ్రులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన పిల్లలను  ఆడపిల్లలను, మగపిల్లలతో వేరువేరు ఐసోలెట్లో ఉంచడం జరిగిందని చెప్పారు.

జిల్లా వైద్య శాఖ అధికారిని, అదనపు జిల్లా వైద్య శాఖ అధికారి పర్యవేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు.   పాఠశాల లోపలకి ఎవరికి అనుమతి లేదని ప్రవేశం నిషేధించాలని తల్లిదండ్రులు ఎవరు పాఠశాలకు రావద్దని ఆర్డిఓ తెలిపారు. అలాగే  పిల్లలను కూడా ఎవరిని ఇంటికి పంపమని చెప్పారు.   వీరికి ప్రత్యేక వైద్య సేవల

నిమిత్తం  ఒక ఎంబిబిఎస్ డాక్టర్ని, 8 మంది నర్సులను, ఒక  అంబులెన్స్ ఏర్పాటు చేశామని అలాగే అవసరం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ముఖ్యంగా పెద్దాపురం నగర ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని ఈ పాఠశాల ఊరిచివర ఉందని, పిల్లలందరూ ఆరోగ్యంగానే ఉన్నారని డీఎస్పీ శ్రీనివాసరావు  తో కలిసి

పరిశీలించడం జరిగిందని తెలిపారు . స్కూల్ ప్రిన్సిపాల్ రామిరెడ్డి  , డాక్టర్ను కలిసి వైద్య సేవలు, పరిస్థితిపై చర్చించడం జరిగింది తెలిపారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam