DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అక్రమమద్యం అడ్డుకట్టకై కఠిన చర్యలు: కలెక్టర్ మల్లికార్జున 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 04,  2021 (డిఎన్ఎస్):* జిల్లాలో అక్రమమద్యం అడ్డుకట్ట కై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. సోమవారం 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అయన పాల్గొన్నారు. ఈ

సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయ స్థాయిలో దిశా యాప్ పట్ల అందరికీ అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. పోలీసు, ఎక్సైజు, అటవీ శాఖ అధికారులతో కలసి జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో గంజాయి అక్రమ రవాణా పై దాడులు చేయడం, కేసులు పెట్టడం, సాగును గుర్తించి ధ్వంసం చేయడం మొదలైన చర్యలు చేపట్టామని చెప్పారు. పోలీసు

సూపరింటెండెంట్ మాట్లాడుతూ అక్రమ మద్యాన్ని తయారు చేస్తున్న, విక్రయిస్తున్న వారిపై కేసులు పెట్టడం, నల్ల బెల్లాన్ని, బెల్లపు ఊటను  గుర్తించి ధ్వంసం చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో అక్రమ మద్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించారు.  అంతేకాకుండా

రాష్ట్రంలో మద్యం వాడకాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. దిశ యాప్ వాడకాన్ని విస్తృత పరచాలని గంజాయి వంటి వాటిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఆయన డీజీపీ గౌతమ్ సవాంగ్ తో కలసి అన్ని జిల్లాల జిల్లా కలెక్టర్లు, ఎస్.పి.లు ఎక్సైజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో

విశాఖపట్నం నుండి ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్.వి.వి. ఎన్. బాబ్జి రావు, అడిషనల్ ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam