DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కిషోర బాలికలకు ఉపాధ్యాయులే అవగాహన కల్పించాలి: కలెక్టర్

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విజయనగరం, అక్టోబర్ 05, 2021 (డిఎన్ఎస్):* ఋతు సంబంధ సమస్యల వలన కిషోర బాలికల ఇబ్బందులు పడకుండా ఉపాధ్యాయులే అవగాహన కల్పించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి  మంగళ వారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ ద్వారా స్వేచ్చ –

కట్టుబాట్ల నుండి స్వేచ్చ లోనికి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తల్లీ తండ్రి తర్వాత  ఉపాధ్యాయులే తొలి గురువులని, వారు చెప్పేదానిని విద్యార్ధులు తప్పక పాటిస్తారని, సానిటరీ నాప్కిన్ల వినియోగం, డిస్పోజల్ తదితర అంశాల పై ఉపాధ్యాయులే పిల్లలకు అవగాహన కలిగించాలని తెలిపారు.

 అమ్మాయిలు వారి లో నున్న సమస్యలను చెప్పుకోడానికి సంకోచిస్తుంటారని,  వారి సందేహాలను, సంకోచాలని పారద్రోలి స్వేచ్చగా ఉపాధ్యాయులతో చెప్పుకునే పరిస్థితిని కల్పించాలని అన్నారు.  అనేక గర్భ శ్రావాలకు , బరువు తక్కువ పిల్లలు జన్మించడానికి మహిళల పరిశుభ్రత, ఆహారం, ఆరోగ్యం కారణాలని వాటిని అధిగమించడానికి ఇప్పట్నుంచే

వారికీ అన్ని అంశాల పట్ల అవగాహన కలిగించాలన్నారు.  ఫోర్టిఫైడ్ బియ్యాన్ని గ్రామాల్లో పౌర సరఫరా ద్వారా అందించడం జరుగుతోందని,  ఈ బియ్యం లో ఐరన్, ఫోలిక్ ఉంటాయని, రక్త హీనత రాకుండా దోహద పడతాయని వీటిని తప్పక వినియోగించాలని పిల్లలే పెద్దలకు చెప్పాలని అన్నారు.  ప్రతి ఒక్కరు దిశా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని, మగ వారు

కూడా చేసుకుంటే అత్యవరస పరిస్థితుల్లో అమ్మాయిల్ని ఆపద నుండి రక్షించ వచ్చని అన్నారు.  ప్రతి ఒక్కరు వాక్సినేషన్ వేసుకొని కోవిడ్ బారిన పడకుండా ఉండాలని కోరారు. 
    సంయుక్త కలెక్టర్ డా. మహేష్ కుమార్ మాట్లాడుతూ  పదేళ్ళు నిండిన తర్వాత బాలికల్లో శరీరం లో హార్మోన్ల  వలన రుతు సంబంధ సైకిల్ ప్రారంభం అవుతుందని,

ఇది అత్యంత సాధారణ విషయమని అన్నారు.  నెలసరి  రావడం వలన ఇమ్మ్యూనిటి తగ్గుతుందని, మంచి ఆహారం తో పాటు, శారీరక పరిశుభ్రత అవసరమని అన్నారు.   పునరుత్పతి ట్రాక్ ఇన్ఫెక్షన్లు, యూరినరి ట్రాక్ ఇన్ఫెక్షన్లు, ఈస్ట్ మరియు బాక్టీరియా ల  ఇన్ఫెక్షన్లు వచ్చే అకాశం ఉంటుందన్నారు.  పిల్లలు తల్లులతో, ఉపాధ్యాయులతో వారి సమస్యల పట్ల

చర్చించుకోవాలని అన్నారు. 
ఈ  వీడియో కాన్ఫరెన్స్ కు గజపతినగరం మండలం  పురిటి  పెంట  ప్రభుత్వ బాలికల పాఠశాల వద్ద  లైవ్  టెలికాస్ట్ ఏర్పాట్లను గావించారు.  ఈ కార్య క్రమం లో గజపతి నగరం లో శాసన సభ్యులు బొత్స అప్పల నరసయ్య, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేశ్వరి, జిల్లా విద్య శాఖాధికారి సత్య సుధ, సర్వ శిక్షా

అభియాన్ ఎ.పి.సి డా. స్వామి నాయుడు, మెప్మా పి.డి సుధాకర రావు,  ఎం.పి.పి బెల్లన జ్ఞాన జ్యోతి, సర్పంచ్ విజయలక్ష్మి,  ఎం.పి.టి.సి లు, విద్య కమిటి చైర్మన్, ప్రధాన ఉపాధ్యాయులు తర్దితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam