DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శరవేగంగా పోలవరం జలవిద్యుత్ కేంద్రం పనులు

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, అక్టోబర్ 05, 2021 (డిఎన్ఎస్):* భారీ వరదలు పోటెత్తుతున్నా తూర్పుగోదావరి జిల్లా గోదావరి నది పై జరుగుతున్న పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు.శరవేగంగా సాగుతున్నాయి. ఇటీవలే పోలవరం జలవిద్యుత్ కేంద్రం ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు ప్రారంభమయ్యాయి.  జలవిద్యుత్

కేంద్రంలో మొత్తం  12 ప్రెజర్ టన్నెల్స్ ఉన్నాయి. ఒక్కో టన్నెల్ పొడవు 150.3 మీటర్లు,  వెడల్పు 9 మీటర్లు గా ఉంది. అతి తక్కువ కాలంలోనే రెండవ  టన్నెల్ తవ్వకం ను కూడా మేఘా ఇంజనీరింగ్ సంస్ద పూర్తి చేసింది. మిగతా టన్నెల్స్ తవ్వకం పనులు కూడా చురుకుగా సాగుతున్నాయి.   

మేఘా ఇంజనీరింగ్ సంస్ద ఇప్పటికే 2139639 క్యూబిక్

మీటర్ల కొండతవ్వకం పనులు పూర్తి చేసింది.  పోలవరం జలవిద్యుత్ కేంద్రం కొండ తవ్వకం పనులు దాదాపు పూర్తి అయినట్టే.

జలవిద్యుత్ కేంద్రంలో 12వెర్టికల్ కల్పన్ టర్బైన్ ,ఒక్కో టర్బైన్ కెపాసిటీ  80 మెగా వాట్లు. అదే విధంగా 12 ప్రెజర్ టన్నెల్,వీటికి 12జనరేటర్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ 100మెగా వాట్ల

కెపాసిటీ తో ఉంటుంది.

టన్నెల్ తవ్వకం పనులను జెన్కో ఎస్ ఈ: ఎస్ శేషారెడ్డి, ఈఈ లు ఏ.సోమయ్య,సి.హనుమ, మేఘా ఇంజనీరింగ్ సంస్ద వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జిఎం ముద్దుకృష్ణ, ఎజిఎం క్రాంతికుమార్,రాజేష్ కుమార్,మేనేజర్ మురళి తదితరులు పర్యవేక్షించారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam