DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఒక్కఛాన్స్ అడిగింది ప్రజా ఆస్తులు తాకట్టు పెట్టుకోడానికేనా? 

*మిగిలింది ఆర్కే బీచ్, కైలాసగిరి, జూ పార్క్, అవి కూడా తాకట్టు పెట్టండి*

*ఈ లావాదేవీలపై సీబీఐ విచారణ కోరాం: బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు*

*(DNS report : సత్య గణేష్ BVS, స్టాఫ్ రిపోర్టర్, Vizag)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 06, 2021 (డిఎన్ఎస్):* వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కచాన్స్ ఇవ్వండి అని అడిగింది కోట్లాది

రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టుకోడానికేనా అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మండిపడ్డారు. మహా విశాఖనగరంలోని ప్రభుత్వ ఆస్తులను వివిధ బ్యాంకుల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాకట్టు పెట్టడాన్ని నిరసిస్తూ  విశాఖ బీజేపీ శాఖ ధర్నా చేపట్టింది. బుధవారం

విశాఖ లోని జివిఎంసి కార్యాలయం ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన హామీలను నెరవేర్చుకోడానికి ప్రజా ఆస్తులను తాకట్టుపెట్టడం ఏంటని మండి పడ్డారు. ఆయన మీ సొంత అజెండా కోసం ప్రజల ఆస్తులను ఎలా తాకట్టు పెడతారన్నారు. ముందుగా మీ సొంత ఆస్తులైన ఇడుపులపాయ ఎస్టేట్, లోటస్

పాండ్, బెంగుళూరు వైట్ ఫీల్డ్, భారతి సిమెంట్స్లు ఇలా మీ సొంత ఆస్తులు తనఖా పెట్టాలన్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ లో జనాన్ని తామే ఉద్ధరిస్తున్నట్టుగా కబుర్లు చెప్పే జగన్ మోహన్ రెడ్డి,  
కూడా తాకట్టు పెట్టేసాడు. 

ప్రస్తుతం తనఖా పెట్టిన ఆస్తుల్లో గవర్నర్ బంగ్లా, సీతమ్మధార ఎం ఆర్ ఓ కార్యాలయం, ఆర్ అండ్ బి

క్వార్టర్లు,  విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ ఐటిఐ కళాశాల, గోపాల పట్నం రైతు బజార్, చిన్నగదిలి డెయిరీ ఫార్మ్, బక్కన్నపాలెం లోని పట్టు పరిశ్రమ శాఖ స్థలం, కిర్లంపూడి లే అవుట్ లోని పోలీస్ క్వార్టర్లు, ఈ బంగ్లా, పి డబ్ల్యు డీ ఆఫీస్, ఈ బంగ్లా, సిఈ ఇలా ప్రస్తుతానికి వీటిని తాకట్టు

పెట్టారన్నారు.   
  
వీటిల్లో కొన్ని సెప్టెంబర్ 27, 2021 నాడు రిజిస్ట్రేషన్ కూడా చేసేశారన్నారు. రెండో దశలో కొన్ని తాకట్టుకు సిద్ధంగా ఉంచారన్నారు. ఇక విశాఖపట్నం లో మిగిలినవి KGH ఆసుపత్రి, ఘోష ఆసుపత్రి, పోలీస్ కమిషనర్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం, కలెక్టర్ ఇల్లు, జిల్లా కోర్టు భవనం, అతి పెద్ద రామకృష్ణా బీచ్,

విశాఖపట్నం రైల్వే స్టేషన్, కైలాసగిరి, జూ పార్క్, లాంటివి మిగిలి పోయాయని, వాటిని కూడా తాకట్టు పెట్టండి ఇక విశాఖలో ఇంకెవ్వరూ ఉండక్కరలేదన్నారు.  

ఈ తాకట్టు వ్యవహారం లో జరిగిన అన్ని లావాదేవీలపై  బ్యాంకు అధికారులతో సహా అందరిపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. దీనిపై కేంద్ర

ప్రభుత్వానికి లేఖ వ్రాసినట్టు తెలిపారు. 

ఈ ధర్నా లో ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, ఇతర నాయకులూ పాల్గొన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam