DNS Media | Latest News, Breaking News And Update In Telugu

18 మంది తితిదే బోర్డు సభ్యులకు హైకోర్టు నోటీసులు

*(DNS report : సత్య గణేష్ BVS, స్టాఫ్ రిపోర్టర్, Vizag)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 06, 2021 (డిఎన్ఎస్):* తిరుమల తిరుపతి దేవస్థానముల పాలక మండలి లో సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం బోర్డు

నియమించిన 24 మంది సభ్యుల్లో 14 మందిపై నేరారోపణలు ఉన్నాయని, రాజకీయ నేపథ్యం ఉన్న నలుగురిని సభ్యులుగా నియమించారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అశ్విన్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. 18 మంది సభ్యులను ఇంప్లీడ్‌ చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. పిటిషనర్‌ విజ్ఞప్తిని అంగీకరించిన ధర్మాసనం 18 మంది సభ్యులకు

నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణనను దసరా సెలవుల తర్వాత చేపడతామని తెలిపింది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam