DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర షిరిడి సాయి ఆలయంలో దసరా వేడుకలు అరంభం

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, అక్టోబర్ 07,  2021 (డిఎన్ఎస్):*ఆంధ్ర  షిరిడి గా కొనియాడబడుతున్న తూర్పు గోదావరి జిల్లా బలబద్రపురం గ్రామాల్లో కొలువై ఉన్న షిరిడి సాయి ఆలయం లో  శరన్నరాత్రి వేడుకలు గురువారం ప్రారంభమయ్యాయి. విజయదశమి ఉత్సవాల సందర్భంగా దేవి నవరాత్రి వేడుకలను ఆలయ నిర్వాహకులు

సబెల్లా వీర వెంకట కృష్ణా పురుషోత్తమ రెడ్డి , అనసూయమ్మ దంపతులు అత్యంత వైభవంగా ప్రారంభించారు. 

మహంకాళి వెంకటరామశాస్త్రి  (పెద్దబాబు ) ఆధ్వర్యంలో పలువురు ఋత్వికులు వేద పారాయణం కావించారు. శత చండీ యాగం మహోత్సవం, గణపతి పూజ ,పుణ్యా వచనం, ఋ త్విక్ వరుణం, పంచాంగ శ్రవణం, మహాన్యాసం, ఏకాదశ రుద్రాభిషేకం, చండీ  సప్త

శక్తి పారాయణ హోమం నిర్వహించారు. 
సాయంత్రం సమయంలో శ్రీ సూక్త విధానంగా అమ్మవారిని కుంకుమ పూజ నిర్వహించారు. ప్రతి రోజు గోపూజ కూడా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డిఎన్ఎస్ కు తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam