DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యధావిధిగా గోదావరి నదీకి నిత్య హారతి: ఎంపీ మార్గాని భరత్   

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  
 
*అమరావతి, అక్టోబర్ 07,  2021 (డిఎన్ఎస్):* దాదాపు ఏడాదిన్నర క్రితం రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ లో నిలిచిపోయిన గోదావరి నది నిత్య హారతి కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ గురువారం రాత్రి స్థానిక పుష్కర ఘాట్ లో పున ప్రారంభించారు.

ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ కొన్నేళ్ల క్రితం ప్రారంభించిన ఈ గోదావరి నది హారతి ప్రతి పౌర్ణమి రోజు జరిగేది. తదుపరి నిత్యా హారతి గా మార్చడం జరిగింది. అనంతర కాలం లో ఈ గోదావరి నది హారతి వైభవాన్ని దేవాదాయశాఖ తన పరిధిలోకి తీసుకుంది. అయితే కరోనా మహమ్మారి ప్రభావంతో నిలిచిపోయిన ఈ హారతిని సుమారు

ఏడాదిన్నర తర్వాత తిరిగి గురువారం మొదలు పెట్టారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ భరత్ రామ్ భక్త జన సందోహం మధ్య గోదావరి నదీమ తల్లికి పూజలు చేసి నిత్య హారతి ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ వాణిమోహన్

కృషితో గోదావరి నదికి నిత్య హారతిని ప్రారంభించడం జరిగిందని, కరోనా నేపథ్యంలో దాదాపు ఏడాదిన్నర నుంచి గోదావరి నదికి నిత్య హారతి నిలిచిపోవడం జరిగిందన్నారు. దేశ విదేశాల నుంచి గోదావరి నదీమ తల్లికి నిత్య హారతి కార్యక్రమాన్ని తిలకించడానికి అశేష భక్త జన సందోహం రాజమహేంద్రవరం నగరానికి వస్తుంటారని, ఆ ప్రాశస్త్యాన్ని

 తిరిగి ప్రారంభించడం జరిగిందని అన్నారు.  గోదావరి నది పరీవాహ ప్రాంతంలో చారిత్రాత్మక రాజమహేంద్రవరం ఉండడం అదృష్టం అన్నారు. ప్రస్తుతం దసరా ఉత్సవాల సందర్బంగా రాజమహేంద్రవరంలో జరుగుతున్న గోదావరి నది నిత్య హారతి కార్యక్రమాన్ని భక్తజనం తిలకించి తరించాలన్నారు.  

గోదావరి మాతకు కళాకారులు ఆధ్యాత్మిక నృత్య

నీరాజనం అందించారు. ఈ కార్యక్రమం లో దేవాదాయశాఖ సిబ్బంది, పెద్ద సంఖ్యలో నగరవాసులు  పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam