DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దుర్గ గుడి ఉత్సవ టీవీల్లో క్రైస్తవ ప్రచారంపై దర్యాప్తు

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  
 
*అమరావతి, అక్టోబర్ 08,  2021 (డిఎన్ఎస్):* విజయవాడ లోని ఇంద్రకీలాద్రి శ్రీ కనక దుర్గ ఆలయ పరిధిలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా హిందూ మత ప్రచారం కోసం ఏర్పాటు చేసిన ఎల్ఈడీ ప్రొజెక్టర్‌లో క్రైస్తవ ప్రార్థనల ప్రసారంపై ఈవో దృష్టి సారించారు. కొండపై ఉన్న ఆలయం లో

జరుగుతున్న కార్యక్రమాలను విజయవాడ పట్టణ ప్రజలందరికి తెలియడం కోసం కొండ క్రింద ఉన్న కనకదుర్గ ఫ్లై ఓవర్ వద్ద సహా ఇతర కూడళ్లలో ఎల్ఈడీ టీవీల ద్వారా ప్రసారాలను అందిస్తున్నారు. అయితే ఈ టీవీల్లో వచ్చే ప్రసారాలను రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేట్ లోకల్ టీవీ ఛానెల్ కు అప్పగించింది. వీటిల్లో కేవలం ఇంద్రకీలాద్రి ఉత్సవాలను

మాత్రమే చూపించాల్సి ఉంది. అయితే. .గురువారం రాత్రి  ఈ టీవీల్లో క్రైస్తవ మతప్రచారం చేయడం వివాదంగా మారింది. ఈ ప్రసారం జరిగిన క్రైస్తవ ప్రచారాన్ని కొండ క్రింద టీవీల్లో జనం చూసారు, కొండపైన ఉన్న టీవీల్లో వచ్చిందో లేదో ఎవరూ గమనించలేదు.  ఎల్ఈడీ ప్రొజెక్టర్‌లో క్రైస్తవ ప్రార్థనల ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉద్దేశపూర్వకంగా జరిందా? లేక పొరపాటున జరిగిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎల్ఈడీ ప్రొజెక్టర్‌లో క్రైస్తవ ప్రార్థనలు ప్రసారంపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అమ్మవారి భక్తులతో కలిసి దుర్గ గుడి ఈవోని కలిసి దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఈవో..

భవిష్యత్‌లో ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam