DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దుర్గగుడి ఘటనకు కారణం ఛానెల్ నిబంధనల ఉల్లంఘనే

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  
 
*అమరావతి, అక్టోబర్ 09,  2021 (డిఎన్ఎస్):* విజయవాడ  కనకదుర్గ దసరా ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారంలో ఎల్‌ఈడీ స్క్రీన్లపై కొద్దిసేపు అన్యమత ప్రచార చేయడానికి కారణం సంబంధిత అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టు తీసుకున్న టీవీ ఛానెల్ పూర్తి నిబంధనల ఉల్లంఘన చెయ్యడంగానే కనపడుతోంది.

విజయవాడ ఇంద్రకీలాద్రి పై జరుగుతున్నా వేడుకలను ప్రజలందరికి తెలిసేలా ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయడంతో పాటు, అన్ని ఛానెళ్లకు లైవ్‌ ఫీడ్‌ అందించేందుకు ముందుకొచ్చిన సీ ఛానెల్‌కు దుర్గగుడి పాలక మండలి బాధ్యతలు అప్పగించింది. మూడు ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ఏర్పాటుకు నిజామాబాద్‌కు చెందిన కీర్తితరంగా క్రియేషన్స్‌

సంస్థకు అప్పగించారు. దుర్గగుడిలో జరిగే ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారాలు మొదటిగా ఎల్‌ఈడీ స్క్రీన్లపై ప్రసారం చేయాలి. అయితే వీళ్ళు ఈ ఒప్పందాన్ని సీ ఛానెల్‌ యాజమాన్యం ఉల్లఘించినట్టు తెలుస్తోంది.

ఇంద్రకీలాద్రి ఉత్సవాల చిత్రీకరణ ఫీడ్‌ను నేరుగా ప్రసారం చేయకుండా.. తమ కార్యాలయంలోని లైవ్‌కు అనుసంధానించింది.

 దీంతో ఆ ఛానెల్‌లో ఏ కార్యక్రమం ప్రసం జరిగితే అదే ప్రోగ్రాం ఈ ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై కనబడుతుంది. గురువారం (అక్టోబర్‌ 7, 2021) రాత్రి ఏడున్నర గంటలకు వేడుకలు ముగిసాయి. అప్పటి వరకు సీ ఛానెల్‌ వీటిని ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై ప్రదర్శించింది. 

ఉత్సవాలు ముగియగానే ఎల్‌ఈడీ స్క్రీన్‌లకు, సీ ఛానెల్‌ లైవ్‌కు

లింక్‌ తొలగించాల్సి ఉండగా, సీ ఛానెల్‌ టెక్నీషియన్‌ కేవలం కొండపై ఉన్న ఎల్‌ఈడీ స్క్రీన్‌ స్విచ్‌ మాత్రమే ఆఫ్‌ చేశాడు. మిగతా రెండు ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఆఫ్‌ చేయలేదు.

దీంతో దసరా ఉత్సవాల ప్రసారం ముగిసిన తరువాత, సీ ఛానెల్‌లో ఇతర ప్రసారాలు మొదలయ్యాయి. కొండ కింద ఉన్న స్క్రీన్‌లపై ఆ కార్యక్రమాలు

ప్రసారమయ్యాయి. రాత్రి 7.30 గంటల సమయంలో సీ ఛానెల్‌లో ప్రసారమైన వార్తలు కూడా ఎల్‌ఈడీపై వచ్చాయి.
వీటితోపాటు 8 గంటలకు ఫిలడెల్పియా  చర్చికి సంబంధించిన కార్యక్రమాలు ప్రసారం చేసింది 
(చర్చితో కుదుర్చుకుందున్న ఒప్పందం మేరకు  గత 2  నెలలుగా రాత్రి ఎనిమిది గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది సీ ఛానెల్‌. అది

వారి వ్యక్తిగతం). గురువారం కూడా అదే రీతిలో కార్యక్రమం ప్రసారం అయింది. ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఆఫ్‌ చేయకపోవడం వల్ల జరిగిన పొరపాటు ఇది. అయితే ఆ సమయానికి ఏ ప్రోగ్రాం వస్తుంది అనే విషయం సదరు ఛానెల్ నిర్వాహకులకు తెలుసు. అయినప్పడికి వాళ్ళు దీన్ని పట్టించుకోలేదు.

కొంత మంది భక్తులు ఫిర్యాదు చేయడంతో.. పొరపాటు

గుర్తించి ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఆఫ్‌ చేసింది. సీ ఛానెల్, కీర్తితరంగా క్రియేషన్స్‌ నిర్లక్ష్యంపై విజయవాడ దుర్గ గుడి ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారూ. ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఆఫ్‌ చేయడంలో నిర్లక్ష్యం వహించిన టెక్నీషియన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam