DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*జగన్ నిర్వహకం వల్ల కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు*

*బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు*

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 09, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహకం వల్ల  ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు అప్పుల బాధలు తట్టుకోలేక కాంట్రాక్టర్లు ఆత్మహత్య లు చేసుకుంటున్నారని. బీజేపీ రాష్ట్ర

ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మండిపడ్డారు. శనివారం నగరంలోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తినడానికి తిండి కూడా లేని దౌర్భాగ్య పరిస్థితి వచ్చి రోడ్డున పడ్డారని, ఈ  ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు ఇంత దయనీయ దౌర్భాగ్య పరిస్థితి గతంలో ఎప్పుడు ఇలాంటి దీన

స్థితి కాంట్రాక్టర్లు కి రాలేదన్నారు.
గత ముందు జన్మలో కూడా పాపాలు చేసి ఉంటే సీఎం జగన్ ప్రభుత్వం లో పని చేయడమేనన్నారు.  ఇలాంటి దారుణ పరిస్థితి లో కూడా పట్టించుకోకుండా సంక్షేమ పథకాలు కోసం బుట్టన్ నొక్కేస్తున్నారని, పర్యవసానంగా రాష్ట్రం లో కాంట్రాక్టర్లు ఆత్మహత్య లు చేసుకున్న ఘటనలు ఉన్నాయన్నారు. నీ ప్రభుత్వం

టెంపరరీ ప్రభుత్వం కాంట్రాక్టర్లు భయపడాల్సిన అవసరం లేదన్నారు. తదుపరి అధికారం లోకి వచ్చేది మా ప్రభుత్వమేనని, అప్పుడు అందరికి న్యాయం చేస్తామన్నారు. ఈ దుర్మార్గ పాలకులు పెట్టిన బాధలు సొమ్ము ఒకరిది - సోకు ఇంకొకరిది అన్నట్టుగా మారిందన్నారు. 

ఎంతో మంది ఫోన్ కాల్స్ చేసి బాధలు చెపుతున్నారని, నీ వల్ల చనిపోయిన

కాంట్రాక్టర్లు కు ఆర్ధిక సహాయం చేయాలని డిమాండ్ చేసారు.  ప్రజలు కూడా మీ పిచ్చి చేష్టలు చూస్తున్నారన్నారు. 

మీ సొంత మెహర్బానీ కోసాం తాకట్టు కి మీకు విశాఖ పట్నమే దొరికిందా.. కడపలో ఉన్న ఆస్తులపై పెట్టండి, లేదా, బెంగుళూరు లో, హైదరాబాద్ లోనూ ఉన్న మీ ప్యాలెస్ లు తాకట్టు పెట్టాలన్నారు. విశాఖ తాకట్టు ప్రభావానికి

తర్వాత ఎన్నికలో డిపాజిట్ లు కూడా రావన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam