DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమలలో సీఎం జగన్‌  శ్రీ వారికి పట్టువస్త్రాలు సమర్పణ 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 11,  2021 (డిఎన్ఎస్):* కలియుగ దైవం, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత పవిత్రమైన ఐదవరోజు గరుడ వాహనం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తిరుమలకు వచ్చారు. తిరునామం, పంచెకట్టు ధరించి, శ్రీవైష్ణవ సంప్రదాయంలో

అత్యంత ఉన్నత గౌరవమైన పరివేట్టం ను శిరస్సుపై ధరించి, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా భేటీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి శోభాయాత్రగా బయలుదేరి వెళ్లి ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేదపండితులు సీఎం వైయస్‌ జగన్‌ గారికి ఆశీర్వచనాలు అందించారు. టీటీడీ చైర్మన్‌

వైవీ సుబ్బారెడ్డి సీఎం వైయస్‌ జగన్‌ గారికి తీర్థప్రసాదాలు అందజేశారు. 2022 తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్‌ను, డైరీని సీఎం వైయస్‌ జగన్‌ గారు ఆవిష్కరించారు. అనంతరం శ్రీవారి గరుడ వాహన సేవలో పాల్గొన్నారు. అంత‌కుముందు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam