DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారి సన్నిధిలో సీఎం వైఎస్ జగన్ తులాభారం

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 12,  2021 (డిఎన్ఎస్):* కలియుగ దైవం, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత పవిత్రమైన ఆరవరోజు ఉదయం విఐపి బ్రేక్ దర్శన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వామి ని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం తులాభారం లో తూగి

మ్రొక్కు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర భక్తి  కన్నడ, హిందీ ఛానెల్స్ ను ప్రారంభించి, అనంతరం భక్తుల కొరకు శ్రీవారి ప్రసాదం లడ్డులను తయారు చేసే "లడ్డు పోటు" ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఆలయ ఈఓ డా. జవహర్ రెడ్డి, ఇతర సిబ్బంది

పాల్గొన్నారు. 

సోమవారం తిరునామం, పంచెకట్టు ధరించి, శ్రీవైష్ణవ సంప్రదాయంలో అత్యంత ఉన్నత గౌరవమైన పరివేట్టం ను శిరస్సుపై ధరించి, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా భేటీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి శోభాయాత్రగా బయలుదేరి వెళ్లి ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ

సందర్భంగా వేదపండితులు సీఎం వైయస్‌ జగన్‌ గారికి ఆశీర్వచనాలు అందించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam