DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎఒబి లో ఎదురుకాల్పులు, ముగ్గురు మావోల మృతి

*(DNS Report : Acharyulu SV, Bureau Chief, Srikakulam)*

*శ్రీకాకుళం, అక్టోబర్ 12,  2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, ఒక జవాన్ కు గాయాలయ్యాయి. మావోయిస్టు కి చెందిన ఒక ఇన్సాస్ తుపాకి స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర ఒరిస్సా

సరిహద్దు  ప్రాంతం లోని మల్కన్గిరి జిల్లా మతిలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తులసి పహాడ్ అటవీ ప్రాంతంలో ఘటన జరిగినట్టు తెలుస్తోంది. మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో పోలీసులకు గాయాలు అయ్యాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్ట్ మృతిచెందినట్లు   ఒరిస్సా డిజిపి ప్రకటించారు. మృతి చెందిన మావోయిస్టు AOB ఎస్ జెడ్ సీ

మల్కన్ గిరి - కోరాపుట్- విశాఖ బోర్డర్ డివిజన్ సభ్యురాలు గా ప్రాధమికంగా నిర్ధారణ అయ్యింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam