DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వెంకటాచార్యుల తపోఫలమే శ్రీ రమ్య తిరుమల ఆవిర్భావం

*ఆలయ ముఖద్వార నిర్మాణం లో యధాశక్తి పాల్గొనండి* 

(DNS Report : Acharyulu SV, Bureau Chief, Srikakulam)

శ్రీకాకుళం, అక్టోబర్ 14,  2021 (డిఎన్ఎస్): శ్రీకాకుళం లోని శ్రీ రమ్య తిరుమల ఆధ్యాత్మిక ప్రాంగణానికి అద్భుతమైన భక్తి నిదర్శనంగా చరిత్ర ఉంది. కోరిన కోర్కెలు తీర్చే ప్రత్యక్ష దైవం రమ్య తిరుమల లో వేంచేసిన శ్రీనివాసుడు. అయన

ఆవిర్భావం పట్ల భక్తి కి నిదర్శనం ఉంది. ప్రముఖ వైష్ణవ ప్రముఖులు కరి వెంకటాచార్యులు కొన్ని ఏళ్ళ పాటు తిరుమల శ్రీనివాసుని ఆరాధనలో ధ్యానానికి పరవశించిన స్వామి వీరి నివాసం లోనే స్వామి  ప్రత్యక్షమై అర్చామూర్తిగా ఆరాధనలు అందుకుంటున్నారు. 
ఆలయ ఆవిర్భావ వైభవాన్ని భక్తులందరికీ కల్గించిన కరి వెంకటాచార్యులు ఉర్లాం

లో శ్రీవైష్ణవ సంప్రదాయ వంశంలో కరి వెంకటప్పలాచార్యులు, రంగనాయకమ్మ దంపతులకు జన్మించారు. ఉద్యోగ రీత్యా కుటుంబంతో శ్రీకాకుళం వచ్చి అక్కడ అరసవల్లి రోడ్డులో నివాసాన్ని ఏర్పర్చుకున్నారు. అయితే వారికి చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక చింతన ఉండేది. ఉద్యోగంలో వున్నా వారు ఇంట్లో ఉదయం, సాయంత్రం పూజలు చేసుకునేవారు. వారు

ఎన్నోసార్లు సుందరకాండ పారాయణం, అష్టాక్షరి అక్షర లక్షలు చేశారు. అలా కొన్నాళ్ల తరువాత వారి ఇంటికి శ్రీనివాసుడు తన ఇద్దరు దేవేరులతో ఉత్సవ విగ్రహ రూపంలో వారి ఇంటికి వేంచేయడం జరిగింది. అప్పటి నుండి వారి నివాసంలో స్వామి వారు శ్రీ రామాయణ, భారత, భాగవత ప్రవచనాలు, తెప్పోత్సవాలు, సుదర్శన హోమాలు చేయించుకోవడం జరిగింది. 


సేవలతో శ్రీనివాసుడు తృప్తి చెందక ఇంకా నా సేవలు నువ్వు చెయ్యాలి నేను అర్చామూర్తిగా నీ దగ్గరకు వస్తాను అని స్వామి వారికి తెలియచెయ్యగా వారి నివాసంలో ముందు భాగంలో స్వామి వారికి నివాసాన్ని ఏర్పరచగా స్వామి వారు శ్రీ వికృతినామ సంవత్సరం, ఉత్తరాయణం, నిజ వైశాఖమాసం శుద్ధ దశమి, ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఆర్చామూర్తిగా

ప్రతిష్ఠించబడ్డారు. అప్పటి నుండి స్వామి వారు భక్తుల పాలిట కొంగు బంగారమై వారి కోర్కెలని తీరుస్తున్నారు. 
అలా ఒక 8 సంవత్సరాలు గడచిన తరువాత వారి కుమారుడు కరి రంగనాధ వేణు మాధవాచార్యులు లౌకిక ఉద్యోగంలో ఉండగా  వారికి  కూడా స్వామి వారు కనబడి ఉద్యోగాన్ని మానేసి వారి సేవకు రమ్మనమని ఆజ్ఞాపించారు. వారు కూడా

ఉద్యోగాన్ని వదిలి స్వామి వారి సేవకు వచ్చారు. తరువాత స్వామి వారు వారితో కూడా సుందరకాండ పారాయణలు, ధనుర్మాస ఉత్సవాలు చేయించుకుంటున్నారు. తరువాత వారికి అమ్మవారు సేవలు కూడా నువ్వు చెయ్యాలి అని ఆ శ్రీ మహాలక్ష్మి అర్చామూర్తి శ్రీ విలంబి నామ సంవత్సరం, శ్రావణ శుద్ధ పంచమి నాడు అమ్మవారు ప్రతిష్టించబడ్డారు. అప్పటి నుండి

అమ్మవారికి శ్రావణమాసం నెలరోజులు కుంకుమ పూజలు చేయించుకుంటున్నారు. స్వామి వారు, అమ్మవారు ఇద్దరు కొలువై భక్తుల కోర్కెలను తీరుస్తున్నారు.

కొరోనా మహమ్మారి  బారి నుంచి మానవాళిని రక్షించాలని కోరుతూ స్వామిని  ప్రార్థిస్తూ గత జులై నెల 10 వ తేదీ పునర్వసు నక్షత్రం నుంచి ఆగస్టు 5 వ తేదీ పునర్వసు నక్షత్రం వరకూ 27

రోజుల పాటు శ్రీమద్రామాయణ పారాయణ దీక్షగా పారాయణ నిర్వహించారు. స్వామి అనుగ్రహం ఫలితంగా సెప్టెంబర్ 1 వతేదీన ముఖద్వార నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని అర్చకులు తెలియచేస్తున్నారు. 

శ్రీ శ్రీ సంప్రదాయ సాహిత్యరంగం సంస్థ చే నిర్వహించబడుతున్న రమ్య తిరుమల ఆలయంలో ప్రతి రోజు సుందరకాండ పారాయణ, శ్రావణ మాసం నెల

రోజుల పాటూ ప్రత్యేక కుంకుమార్చనలు, ప్రతి వారం స్వామి కి అభిషేకం జరుపుతున్నామన్నారు. ప్రతిరోజూ నిత్య అన్న ప్రసాద వితరణ, నిరాశ్రయులకు, ఆశ్రమాల్లో ఉండేవారికి పేదలకు వస్త్రాల అందజేత తదితర సేవా కార్యకమాలు చేపడుతున్నారు.    

ఆలయం దగ్గర లక్ష్మీనారాయణ స్వరూపంగా.భావించే అశ్వర్ధ వృక్షం ( రావిచెట్టు,

వేపచెట్టు కలిపి ) స్వయంభువుగా ఉద్భవించాయి. స్వామి ఆవిర్భావ వైభవానికి ప్రత్యక్ష నిదర్శనం. 

ఆలయ అభివృద్ధి కోసం, ఆలయం లో జరిగే వైదిక కార్యక్రమాల్లోను, ఇతర సేవా కార్యక్రమాల్లో పాల్గొనదలచిన వారు ఆలయ అర్చకులు రంగనాధ వేణుమాధవాచార్యులు  ను +91 94400 61940 నెంబర్ లో సంప్రదించవచ్చు. 

భక్తుల సహకారంతో,

చేపట్టిన ఈ మహోన్నత కార్యక్రమం లో ముఖద్వార నిర్మాణానికి విరాళాలు యధాశక్తిగా సమర్పించవలసినదిగా కోరుతున్నారు.  విరాళాలను  ఫోన్ పే  నెంబర్ (+91 94400 61940 ) కు గానీ, యూనియన్ బ్యాంకు అకౌంట్ నెంబర్ :211112010000017 , IFSC కోడ్: UBIN 0821110  కు గానీ పంపవచ్చు అని తెలియచేసారు.   

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam