DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యుపి ఘటనకు నిరసనగా రైల్వేపట్టాలపై రాస్తారోకో 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 18,  2021 (డిఎన్ఎస్):* ఉత్తర ప్రదేశ్ లఖింపూర్ ఖేరు ఘటనకు నిరసన తెలియచేస్తూ మహా విశాఖ నగర పరిధిలోని అనకాపల్లి రైల్వేస్టేషన్ లోని పట్టాలపై  నిరసన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర రైతు చట్టాలను రద్దు చేయాలని ఉత్తర ప్రదేశ్ లఖింపూర్ ఖేరు లో

నలుగు రైతులను కారుతో వేనుక నుంచి  గుద్ది చంపిన సంఘటన తెలిసిందే. ఈ ఆందోళనలో రైతు సంఘలు, సిఐటియు, ఎస్ఎప్ఐ, వామపక్షల అద్వర్యంలో జరిగింది. ఈ సందర్బంగా ఆందోళనకారులు మాట్లాడుతూ  ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం  కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశ వ్యాప్తంగా ఆందోళన

చేస్తామన్నారు. 
ఈ కార్యక్రమంలో ఎస్ ఐ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నా నిరసనను ఆందోళనకారులు కొనసాగించడంతో అదుపులోకి తీసుకుని స్థానిక పట్టణ పోలీసు స్టేషనకు తరలించడం జరిగింది. 
ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం, రైతు సంఘం, సిపిఎం జిల్లా కమిటీ, సిఐటియు, రైతు సంఘం నాయకులు, ఐద్వా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam