DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరెంటు నిరంతర సరఫరాపై  సీఎం వైఎస్ జగన్ సమీక్ష

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  
 
*అమరావతి, అక్టోబర్ 18,  2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి వైయస్‌. జగన్‌ మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఇంధన శాఖకార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్, జెన్‌కో ఎండీ శ్రీధర్‌ సహా పలువురు అధికారులు హాజరు

అయ్యారు. ప్రధానంగా చర్చించిన అంశాలు.. .

బొగ్గు సరఫరా, విద్యుత్‌ కొరత రాకుండా అమలు చేస్తున్న అత్యవసర ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాలపైనా నిశితంగా సమీక్ష జరిగింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరంతరంగా కరెంటును సరఫరాచేస్తున్నామని, ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుని ఆమేరకు తగిన చర్యలతో ముందుకు

వెళ్తున్నామని అధికారులు తెలిపారు. మహానది కోల్‌ఫీల్డ్స్‌ నుంచి 2 ర్యాకులు బొగ్గు అదనంగా వచ్చిందన్నారు. రాష్ట్రంలో జెన్‌కో ఆధ్వర్యంలో థర్మల్‌విద్యుత్‌ ఉత్పత్తిని 50 మిలియన్‌ యూనిట్ల నుంచి 69 మిలియన్‌ యూనిట్లకు పెంచామన్నారు. 
థర్మల్‌విద్యుత్‌కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూసుకోవాలని సీఎం

ఆదేశించారు. సింగరేణి సహా కోల్‌ఇండియా తదితర సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు.  బొగ్గు తెప్పించుకునేందుకు సరుకు రవాణా షిప్పుల వినియోగం లాంటి ప్రత్యామ్నాయాలపైకూడా ఆలోచనలు చేయాలన్నారు. దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయని తెలిపారు. దీనికోసం సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాలన్నారు.

పవర్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ నుంచి 170 మెగావాట్ల విద్యుత్‌కూడా అందుబాటులోకి వస్తోందన్నారు. కావాల్సిన విద్యుత్‌ను సమీకరించుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుత్‌ ఉత్పత్తి వ్యూహాలపైనా దృష్టిసారించాలని ఆదేశం. 6300 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్‌ఉత్పత్తి

ప్రాజెక్టు నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. సీలేరులో ప్రతిపాదిత 1350 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ ప్రాజెక్టుపైనా దృష్టిపెట్టాలన్నారు. ఈప్రాజెక్టులను సాకారం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం జారీ చేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam