DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మతమార్పిడి నిరోధక చట్టం తెస్తే మరో టర్మ్ జగనే సీఎం

*శ్రీ పీఠాధిపతులు స్వామి పరిపూర్ణానంద ప్రకటన* 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 20,  2021 (డిఎన్ఎస్):* ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లో మతమార్పిడి నిరోధక చట్టం తీసుకు వస్తే మరో టర్మ్ కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశాన్ని హిందూ సమాజం ఇస్తుందని కాకినాడ శ్రీపీఠాధిపతులు

స్వామి పరిపూర్ణానంద పిలుపునిచ్చారు. బుధవారం విశాఖ నగరానికి వచ్చిన ఆయన సీతమ్మధార లోని అభయ ఆంజనేయస్వామి ఆలయంలో కోటి హనుమాన్ చాలీసా పారాయణ ను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దేవాలయ వ్యవస్థను పునరుద్దరించాలని పిలుపునిచ్చారు.  తెలుగు రాష్ట్రాల్లో దేవాదాయ శాఖా ధనదాహానికి దేవాలయాలు

బలిఅవుతున్నాయన్నారు. పూర్వ కాలం నుంచి వచ్చిన దేవాలయాల నిర్వహణకై దాతలు వేలాది భూములు దానంగా ఇచ్చారని, తద్వారా వచ్చే ఆదాయం ద్వారానే ఆలయాలు నడవాలన్నారు. 

అయితే ప్రభుత్వ పెత్తనం వచ్చి స్వామి ని సామాన్యుడు దర్శించుకునే అవకాశమే లేకుండా  అడుగు పెడితే టికెట్ కొనాలి అనే నిబంధన పెట్టి, భక్తులను నిలువు దోపిడీ

చేస్తున్నారన్నారు. ఈ విధానం మారాలన్నారు. 

అదే విధంగా హిందూ సమాజాన్ని తొక్కేందుకు బలవంతపు మతమార్పిళ్లు చేస్తున్నారని, వాటిని తక్షణం అరికట్టనట్టయితే. . .హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. త్వరలోనే దేవాలయాల పరిరక్షణకై సమాజంలోని అన్ని ధార్మిక సంఘాలు, పీఠాధిపతులతో చర్చలు

జరుపుతామన్నారు. 

దేవాలయాల భూములను దోపిడీ చేసిన వారిపై చర్యలకు డిమాండ్ చేసారు. ఈ రాష్ట్రంలో హిందూ సమాజం నిస్సత్తువగా లేదని, సహనం వహిస్తోందన్నారు. అదే సహనం కోల్పోతే. . .పీఠాలు కదిలే స్థితి వచేస్తుందన్నారు. 
తమిళనాడు లో మతమార్పిడి రద్దు బిల్ ను అమలు చేసే జయలలిత రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా అఖండ

విజయాన్ని సాధించారన్నారు. అంతకు ముందు ఆంజనేయ స్వామి ఆవిర్భావ వైభవాన్ని భక్తులకు వివరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam