DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బుద్ధుని ధమ్మ ప్రబోధం మానవ జాతి కోసమే: ప్రధాని మోడీ 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 20,  2021 (డిఎన్ఎస్):*

అభిధమ్మ దినాని కి గుర్తు గా కుశీనగర్ లో మహాపరినిర్వాణ మందిరం లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.  ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు శ్రీయుతులు

జి. కిషన్ రెడ్డి,  కిరెన్ రిజిజూ,  జ్యోతిరాదిత్య సింధియా, శ్రీ లంక ప్రభుత్వం లో కేబినెట్ మంత్రి శ్రీ నమల్ రాజపక్ష,   శ్రీ లంక నుంచి విచ్చేసిన బౌద్ధ ప్రతినిధి వర్గం, ఇంకా  మ్యాంమార్, వియత్ నామ్, కంబోడియా, థాయీలాండ్, లావో పిడిఆర్, భూటాన్, దక్షిణ కొరియా, శ్రీ లంక, మంగోలియా, జపాన్, సింగపూర్, నేపాల్ లకు చెందిన రాయబారులు,

తదితరులు కూడా పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, మంగళప్రదమైన అశ్విన్ పూర్ణిమ సందర్భం గురించి, భగవాన్ బుద్ధుని పవిత్ర స్మృతి చిహ్నాల గురించి తెలియ జేశారు.  శ్రీ లంక ప్రతినిధి వర్గాని కి ప్రధాన మంత్రి స్వాగతం పలుకుతూ, భారతదేశాని కి,  శ్రీ లంక కు మధ్య గల సంబంధాల ను

గురించి గుర్తు కు తెచ్చారు.  అశోక చక్రవర్తి కుమారుడు మహేంద్ర మరియు కుమార్తె సంఘమిత్ర లు బౌద్ధం తాలూకు సందేశాన్ని శ్రీ లంక కు తీసుకుపోయారని ప్రధాన మంత్రి అన్నారు.  ఇదే రోజున ‘అర్హత్ మహింద’ వెనుదిరిగి వచ్చి బుద్ధుని సందేశాన్ని శ్రీ లంక ఎంతో ఉత్సాహం తో స్వీకరించిందని తండ్రి కి తెలియజేశారని ఒక నానుడి ఉందని కూడా

ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.  ఈ కబురు బుద్ధుడి సందేశం యావత్తు ప్రపంచం కోసమని, అలాగే బుద్ధుని ధమ్మ ప్రబోధం మానవజాతి అంతటికీ సంబంధించిందన్న భావన ను పెంచిందని ప్రధాన మంత్రి అన్నారు.

భగవాన్ బుద్ధుని సందేశాన్ని వ్యాప్తి చేయడం లో ఇంటర్ నేశనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేశన్ పోషించిన పాత్ర ను ప్రధాన మంత్రి

ప్రశంసిస్తూ, ఇంటర్ నేశననల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేశన్ కు శ్రీ శక్తి సింహ డిజి గా అందించినటువంటి తోడ్పాటు ను స్మరించుకొన్నారు.  శ్రీ శక్తి సింహా ఇటీవలే కాలం చేశారు.

ఈ రోజున మరొక మంగళప్రదమైనటువంటి సందర్భం కూడా - అది ఏమిటంటే, బుద్ధ భగవానుడు తుశిత స్వర్గం నుంచి భూమి కి తిరిగి వచ్చిన దినం అని ప్రధాన మంత్రి

తెలిపారు.  ఈ కారణం గానే సాధువులు వారి మూడు నెలల ‘వర్షావాస్’ ను ఈ అశ్విన్ పూర్ణిమ నాడు సమాప్తి చేసుకొంటారు.  ఈ రోజు న ‘వర్షావాస్’ ముగిసిన అనంతరం సంఘ్ సాధువు లకు ‘చీవర్ దానాన్ని’ చేసే ఒక ప్రత్యేక అధికారం నాకు దక్కింది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

బుద్ధ అనేది సార్వజనీనమని, ఎందుకంటే బుద్ధ అంతరంగం

లో ఆరంభం అవుతుందని చెప్తారు అని ప్రధాన మంత్రి అన్నారు.  బుద్ధ యొక్క బుద్ధత్వం అనేది అంతిమ బాధ్యత తాలూకు భావన అని ఆయన అన్నారు.  ప్రస్తుతం ప్రపంచం పర్యావరణ పరిరక్షణ ను గురించి మాట్లాడుతోంది.  జల వాయు పరివర్తన పట్ల తన ఆందోళన ను వ్యక్తం చేస్తోంది.  అలాంటప్పుడు వాటితో పాటే అనేకమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి అని

ప్రధాన మంత్రి అన్నారు.  అయితే, మనం బుద్ధుని సందేశాన్ని గనుక అనుసరించిన పక్షం లో ‘ఎవరు చేస్తారు’ అనే దానికి బదులుగా ‘ఏమి చేయాలి’ అనే మార్గం తనంతట తాను బయట పడుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.  మానవ జాతి ఆత్మ లో బుద్ధ కొలువై ఉంటుంది.  అది విభిన్న సంస్కృతుల ను, దేశాల ను కలుపుతున్నది అని ప్రధాన మంత్రి అన్నారు.

 ఆయన బోధించిన దానిలో నుంచి ఈ కోణాన్ని భారతదేశం తన వృద్ధి యాత్ర లో ఒక భాగం గా చేసుకొంది అని ఆయన అన్నారు.  ‘‘జ్ఞానాన్ని, గొప్ప సందేశాల ను లేదా మహనీయుల ఆలోచనల ను పరిమితం చేయడం అనే అంశాన్ని భారతదేశం ఎన్నడూ విశ్వసించలేదు.  మనకు ఉన్నదానినల్లా యావత్తు మానవ జాతి తో పంచుకోవడం జరిగింది.  అందువల్లే అహింస, కరుణ ల వంటి

మానవీయ విలువలు భారతదేశం యొక్క హృదయం లో ఎంతో స్వాభావికం గా స్థిరపడ్డాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. 

బుద్ధ నేడు సైతం భారతదేశ రాజ్యాంగాని కి ప్రేరణ గా ఉన్నది.  బుద్ధ తాలూకు ధమ్మ చక్రం భారతదేశ త్రివర్ణ పతాకం లో నెలవైంది.  అది మనకు గతి ని ప్రసాదిస్తున్నది అని ప్రధాన మంత్రి అన్నారు.  ఈ రోజు కు కూడా

ఎవరైనా భారతదేశ పార్లమెంటు భవనాని కి వెళ్ళినప్పుడు తప్పక ‘ధర్మ చక్ర ప్రవర్తనాయ’ అనే మంత్రాన్ని గమనించవచ్చని ప్రధాన మంత్రి అన్నారు.

గుజరాత్ లో మరీ ముఖ్యం గా ప్రధాన మంత్రి జన్మస్థలం అయిన వడ్ నగర్ లో భగవాన్ బుద్ధుని ప్రభావం గురించి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, బుద్ధుని ప్రభావం దేశం లోని తూర్పు ప్రాంతాల

మాదిరిగానే దేశం లోని పశ్చిమ ప్రాంతాల లోను, దక్షిణ ప్రాంతాల లోను సమపాళ్ళ లో గోచరం అవుతోందని పేర్కొన్నారు.  ‘‘బుద్ధుడు సరిహద్దుల కు, దిశల కు అతీతం అయినటువంటి వ్యక్తి అని, గుజరాత్ యొక్క గతం చాటి చెప్తున్నది.  గుజరాత్ గడ్డ మీద పుట్టినటువంటి మహాత్మ గాంధీ బుద్ధుని సత్యం  మరియు అహింస ల సందేశాని కి ఆధునిక కాలం లో ఒక

పతాకదారి గా నిలచారని’’ శ్రీ నరేంద్ర  మోదీ అన్నారు.

భగవాన్ బుద్ధ ప్రబోధించిన ‘‘అప్ప దీపో భవ’’ మాటల ను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఈ మాటల కు ‘‘మీకు దీపం గా మీరు మారాల్సి ఉంది’’ అని అర్థం అని వివరించారు.   ‘ఒక వ్యక్తి స్వయం ప్రకాశాన్ని పొందుతారో అప్పుడు ఆ వ్యక్తి ప్రపంచాని కి సైతం వెలుగు ను

ఇస్తారు’ అని ఆయన అన్నారు.  భారతదేశం ‘ఆత్మనిర్భరత’ దిశ లో పయనించడానికి ప్రేరణ ఇదేనని కూడా ఆయన చెప్పారు.  ప్రపంచం లో, ప్రతి దేశం యొక్క ప్రగతి లో పాలుపంచుకోవడానికి మనకు బలాన్ని ఇచ్చేది ఈ ప్రేరణే అని ఆయన అన్నారు.  ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, ఇంకా సబ్ కా ప్రయాస్’ మంత్రం ద్వారా భారతదేశం భగవాన్

బుద్ధుని ప్రబోధాల ను ముందుకు తీసుకుపోతోంది అని ప్రధాన మంత్రి తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam