DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రాన్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారు, ఎమ్మెల్యే  ఆదిరెడ్డి

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  
 
*అమరావతి, అక్టోబర్ 21,  2021 (డిఎన్ఎస్):* హెరాయిన్, గంజాయి వ్యవహారాలతో రాష్ట్రాన్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతలపై దాడులను

నిరసిస్తూ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన 36 గంటల నిరసన దీక్షకు మద్దతుగా రాజమహేంద్రవరం నగర టీడీపీ కార్యాలయంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడుల వెనుక పెద్ద కుట్ర జరిగిందని, దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు

చేయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ సీనియర్ నాయకులు పట్టాభి ఇంటిపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయకపోగా ఆయననే అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మాదకద్రవ్యాల కేంద్రంగా మారుతోందని ఆరోపించారు. మత్తు పదార్థాల వల్ల యువత చెడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై

ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని, న్నారు. దాడులు ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమని, దేశ చరిత్రలో ఎప్పుడూ ఈ రీతిలో జరగలేదన్నారు. పోలీసులను పార్టీ కార్యకర్తలుగా ఉపయోగించుకుంటున్నారని దుయ్యబట్టారు. 

కార్యక్రమం లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) మాట్లాడుతూ అధికార వైఎస్సార్

కాంగ్రెస్ పార్టీయే వాళ్ళు చేసినట్టుగా తెలుగుదేశం పార్టీ చేస్తే వారి పార్టీ కార్యాలయాల పరిస్థితి ఏంటో వారి ఊహకే వదిలేస్తున్నామని హెచ్చరించారు. పార్టీ కార్యాలయం అంటే దేవాలయం వంటిదని, ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపితే పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తారా..? అంటూ ప్రశ్నించారు. ఆ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఎవరేం

మాట్లాడారో ప్రజలకు తెలుసునన్నారు. మత్తు పదార్థాల వల్ల యువత చెడిపోతున్నారని, రాష్ట్రం మాదకద్రవ్యాల కేంద్రంగా మారుతోందనే ఆవేదనతో తెలుగుదేశం పోరాడుతుంటే దాడికి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులకు మా నివాళులు అర్పిస్తున్నామన్నారు. ప్రాణ త్యాగం చేసిన పోలీసుల

ఆత్మలు ఈ డీజీపీ తీరుతో ఘోషిస్తాయని, రెండున్నరేళ్లలో డీజీపీ పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఏపీని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేంత వరకు పోరాడతామని తెలిపారు. 

దీక్షలో కార్యక్రమం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ

ప్రతినిధులు పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam