DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేటి నుంచి పోలీసులకు వీక్లి ఆఫ్ అమలు :సీఎం జగన్

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  
 
*అమరావతి, అక్టోబర్ 21,  2021 (డిఎన్ఎస్):*దేశంలోనే మొట్టమొదటిగా పోలీసు సిబ్బందికి వీక్లీఆఫ్‌ ప్రకటించిన ప్రభుత్వం తమదేనని, దాన్ని గురువారం నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్టు ఆంధ్ర ప్రదేశ్చ్చేం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. 
విజయవాడ ఇందిరాగాంధీ

మున్సిపల్‌ స్టేడియంలో గురువారం జరిగిన పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ఆయన హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమరవీరులు పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. 
ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటారు. గత 62 ఏళ్లుగా ఈ

కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా 377 మంది విధి నిర్వహణలో అమరులైతే.. మన రాష్ట్రానికి చెందిన వారు 11 మంది ఉన్నారు. ఈ అమరవీరులందరికి నేడు రాష్ట్రప్రభుత్వం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు. 

పోలీసుల బాగోగుల గురించి

ఆలోచించి.. దేశంలోనే మొట్టమొదటిగా వారికి వీక్లీఆఫ్‌ ప్రకటించిన ప్రభుత్వం మనదే అని తెలుపుతున్నాను. కోవిడ్‌ కారణంగా దీన్ని అమలు చేయలేకపోయాం. ఇప్పుడు వైరస్‌ ప్రభావం తగ్గింది కనుక నేటి నుంచి దీన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టనున్నాం’’ అని తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam