DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీస్ అమరులకు రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖుల ఘన నివాళి

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  
 
*అమరావతి, అక్టోబర్ 21,  2021 (డిఎన్ఎస్):* అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పొలిసు సిబ్బందికి  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ఏలూరు రేంజ్ డీఐజీ కె వి మోహన్ రావు, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఘానా నివాళి

అర్పించారు. ఈ సందర్బంగా  
ఫ్రంట్ వారియర్స్ గా ఉన్న పోలీస్ సిబ్బంది మొదటి రొండవ కరోనా వైరస్ వలన చనిపోయిన కుటుంబ సభ్యులు వారికి ఒక్కరికీ ఒక్కరికీ  రూ. 10,00,000 లు చెక్కు లను హోమ్ గార్డ్స్ సిబ్బంది కుటుంబల  సభ్యులకు 10,40,000 రూ.ల చెక్కు లను అతిధులు అందించారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ

సిబ్బంది యొక్క సంక్షేమం నకు ఎంతో ప్రాధాన్యము ఇస్తున్నామని సిబ్బంది కి సమస్యలు ఉంటె జిల్లా ఎస్పీ ని ప్రత్యక్షము గా కలవ వచ్చనని తెలిపారు.  సమస్య పరిష్కారం కోసం వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలియ చేసారు

రాజమహేంద్రవరం లో. . .

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు

రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆధ్వర్యవం లో  ఘనంగా నివాళులు అర్పించి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 1959లో, లద్దాఖ్‌లో చైనీస్ ట్రూప్ అంబుష్ చేసారు ఆ కాల్పుల్లో 10 మంది భారత జవానులను మృతి చెందడంతో దేశవ్యాప్తంగా ఆక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 కారణంగా 206 మంది పోలీసు సిబ్బంది మరణించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam