DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశ ప్రజలకు, వైద్య బృందాలకు ప్రధాని మోడీ కి అభినందనలు

*100 కోట్ల కు పైగా కోవిడ్ టీకాల ఘనత ప్రజలందరిదే* 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 22,  2021 (డిఎన్ఎస్):* కొరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు అందుబాటులోకి తీసుకురాబడిన టీకా ప్రస్తుతం భారత్ దేశంలో  ఒక బిలియాన్ ( 100 కోట్లమంది) కి పైగా అందించడం పట్ల భారత దేశ ప్రజలకు, వైద్య బృందాలకు సంబంధిత అందరికి

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. శుక్రవారం దేశ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ టీకాలను దేశ ప్రజలందరికి ఉచితంగా ఇవ్వాలనేది తమ ప్రభుత్వ భాద్యతగా ఒక ఉద్యమాన్ని చేపట్టామన్నారు. దీనిలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ, సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ ఘనత చెందుతుందన్నారు.

అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు టీకా వేయించుకునేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని, బహుశా ఇది భయం వాళ్ళ కావచ్చన్నారు. కొందరికి వైద్య చికిత్సల కారణంగా టీకా వేయించుకుని ఉండక పోవచ్చన్నారు. అయితే ప్రపంచ దేశాలకు ధీటుగా భారత వైద్య బృందాలు, ఫ్రంట్ లైన్ వారియర్స్ చేసిన పోరాట ఫలితమే ఈ విజయం అన్నారు. ఎందరు ఎన్ని

విమర్శలు చేసినప్పడికి భారత వైద్య బృందాలు, పరిశోధక శాత్రవేత్తలు, కఠోర దీక్షతో అడుగు ముందుకు వేసి, కోట్లాదిమంది భారతీయులకు మనోధైర్యాన్ని అందించారన్నారు. 

గత నెల సెప్టెంబర్ 17 న దేశ వ్యాప్తంగా ప్రత్యేక టీకా శిబిరాలు నిర్వహించి, ఆ ఒక్క రోజే 2 కోట్ల మందికి పైగా టీకా వాయించి ఒక రికార్డు నెలకొల్పిన విషయం

తెలిసిందే. 

ప్రస్తుతం ఒక బిలియాన్ కి పైగా టీకా వేయించడం ప్రపంచంలోనే ఒక రికార్డుగా నమోదు అయ్యింది. ఈ వివరాలను కోవిడ్ కోసం ఏర్పాటు చేసిన వెబ్సైటు ద్వారా తెలియచేయబడింది. ఈ టీకా లను కేంద్రప్రభుత్వం పూర్తిగా ఉచితంగానే దేశ ప్రజలకు అందిస్తోంది. ఇతర దేశాలకు సైతం టీకాలను అందించి, నరేంద్ర మోడీ తన ఔదార్యాన్ని

చాటుకున్న విషయం తెలిసిందే.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam