DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ఉక్కు కోసం దీక్ష చేసి తెలుగు వాళ్ళ సత్తా చాటండి 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 22,  2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ కీర్తిని దేశ విదేశాల్లో విస్తరింప చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆమరణ నిరాహారదీక్ష చేసి,  తెలుగు వాళ్ళ సత్తా చాటాలని అని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ పిలుపునిచ్చారు.

శుక్రవారం తగరపువలస లో  మీడియా సమావేశం లో మాట్లాడుతూ.. ఎందరో ప్రజల త్యాగాల  ఫలితంగా  ఏర్పడిన విశాఖ ఉక్కు పరిరక్షణ చేయవలసిన భాద్యత ముఖ్యమంత్రి పై ఉందన్నారు. 

ఒక వైపు విశాఖ పట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తామని ప్రకటించిన సీఎం మరోప్రక్క విశాఖ లోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం సరికాదన్నారు.

అప్రజాస్వామిక చర్యల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ  ప్రతిష్ట మసకబారుతోంది అన్నారు. ఆర్థికంగానూ కూడా  రోజురోజుకు మరింత బలహీనంగా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బట్టి చూస్తే  భవిష్యత్తులో ఏ పార్టీ ముఖ్యమంత్రి వచ్చిన  రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలంటే  అది మోయలేని

భారంగా మారుతుందని  వ్యాఖ్యానించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam