DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ ధ్యేయంగా పని చేయాలి: మంత్రి వనిత 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విజయనగరం, అక్టోబర్ 22,  2021 (డిఎన్ఎస్):*  మహిళల భద్రత, ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ,  ఆర్ధిక భారం అయినా  లెక్క చేయకుండా  నిధులను కేటాయిస్తోందని  రాష్ట్ర  మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.  గత ప్రభుత్వం  500 కోట్ల ను కేటాయిస్తీ ఈ

ప్రభుత్వం 1800  కోట్ల రూపాయలను కేటాయించి మహిళల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుందని అన్నారు. విజయనగరం జిల్లా  పరిషత్ సమావేశ మందిరం లో ఐ.సి.డి.ఎస్ సి.డి.పి.ఓ లు, సూపర్ వైజర్లతో సమీక్షించారు. సి.డి.పి.ఓ లు, సూపర్ వైజర్లు తమ పరిధి లోనున్న అంగన్వాడి కేంద్రాలను  రెగ్యులర్ గా తనిఖీలు  తనిఖీలు చేయాలనీ ఆదేశించారు.  క్షేత్ర

స్థాయి లో వై.ఎస్.ఆర్ సంపూర్ణ పోషణ్, పోషణ్ ప్లస్ కార్యక్రమాల క్రింద అందిస్తున్న  ఎండు ఖర్జూరం, బెల్లం, చిక్కీలు, గుడ్లు నాణ్యంగా ఉండడం లేదని కొన్ని చోట్ల ఫిర్యాదులు అందుతున్నాయని,  ఈ పరిస్థితి ప్రభుత్వానికి చెడ్డ పేరును తెస్తుందని అన్నారు . నాణ్యమైన సరుకులు రానపుడు  డెలివరీ తీసుకోకుండా తిరిగి పంపించి వేయాలని

అన్నారు.   స్టాక్ వచ్చేటప్పుడే వెరిఫికేషన్ చేసుకోవాలని, నాణ్యత లేని వాటిని సరఫరా చేసిన వారికి నోటీసు లు జారి చేయాలనీ సూచించారు.  తరచుగా అంగన్వాడి  కేంద్రాలను తనిఖీ చేస్తుంటేనే అక్కడి లోపాలు అధికారుల దృష్టికి వస్తాయని, లోపాలను సవరించుకుంటే  గ్రామాల్లో మెరుగైన సేవలు అందించగలమని అన్నారు.  ఈ తనిఖీలతో

అంగన్వాడీ కేంద్రాల్లో బోగస్ నమోదును కూడా తగ్గించవచ్చని అన్నారు.   ఒక తనిఖీ కి  మరొకసారి వెళ్లి చేసిన తనిఖీ కి మధ్య జరిగిన మార్పులను కూడా గుర్తించాలన్నారు.  ప్రభుత్వం గర్భిణీల, బాలింతల, పసి పిల్లల ఆరోగ్యానికి కేటాయిస్తున్న నిధులు వృద్ధా కాకుండా లబ్ది దారులకు అందిన నాడే  ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ సాధ్యమవుతుందని

అన్నారు.   రాష్ట్రం లో క్లిష్హ్త మైన  ఆర్ధిక పరిస్థితి  ఉన్నప్పటికీ సంక్షేమ పధకాలను అమలుచేస్తున్న ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటీ మీరంతా చిత్త శుద్ధితో పని చేయాలనీ హితవు పలికారు.    
ఈ సందర్భంగా మంత్రి  బాలల గృహం,  వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, మహిళా  ప్రాంగణం, వన్ స్టాప్ సెంటర్, ట్రాఫికింగ్,  జువనైల్ హోం,

వయో వృద్ధులు, సదరం   తదితర  శాఖల పని తీరుపై సమీక్షించారు. సదరం క్యాంపు లను ప్రతి నియోజక వర్గం లో నిర్వహించాలన్నారు.   దివ్యాంగులకు ప్రభుత్వం అందజేస్తున్న ఉపకరణాల పై అందరికీ అవగాహన కలిగించాలన్నారు. 

ఈ సమావేశం లో అరకు పార్లమెంట్ సభ్యులు  గొట్టేటి మాధవి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాస రావు,

  శాసన సభ్యులు కోలగట్ల వీర భద్ర స్వామి, ప్రాంతీయ  ఉప సంచాలకులు చిన్మయి దేవి, పి.డి మహిళా అభివృద్ధి ఛైర్పర్సన్ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam