DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ముద్రా రుణాలు క్రమంతప్పకుండా చెల్లించాలి : హరిబాబు 

విశాఖపట్నం, ఆగస్టు 4 , 2018 (DNS Online): వివిధ పధకాల ద్వారా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లించాలని విశాఖపట్నం లోక్ సభ సభ్యులు డాక్టర్ కె. హరిబాబు

పిలుపునిచ్చారు. శనివారం నగరం లోని ఎంపీ కార్యాలయం లో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నిరుద్యోగులకు ముద్రా రుణాల ధ్రువీకరణ పత్రాలను అయన అందించారు. యువత తన

కాళ్ళ పై తానె నిలబడాలి అనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ముద్రా రుణాలు నేటికి లక్షలాది మందికి అందుతున్నాయని, ఇలా ఋణం పొందిన వారంతా

క్రమం తప్పకుండా ఆయా బ్యాంకులకు రుణాలు చెల్లించినట్టయితే మిగిలిన వారికి కూడా ఈ విధంగా ఋణం అందె అవకాశం ఉంటుందన్నారు. అనంతరం పలువురు లబ్దిదారులకు అయన రుణ

ధ్రువీకరణ పత్రాలు అందించారు. ఈ దేశ సంపదే యువత అని అన్నారు. ఈ కార్యక్రమం లో జాతీయ అవార్డు గ్రహీత ఆర్ రవికుమార్, లబ్ధిదారులు పి. వేణుగోపాల్ - 5 లక్షలు, గుండు శుభకర్ -5

లక్షలు, à°Žà°‚. నరేష్ - 3 లక్షలు, రమణమ్మ - 75 వెలు, బి, రాజేశ్వరి - 75 వేలు అందించారు. 

 

#dns #dns live #dns news #dnslive #dnsnews #dns media #dns media #vizag #visakhapatnam #bjp #mp #mudra loans #visakhapatnam mp #haribabu #loans
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam