DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పార్టీల భాషను స్కూళ్లల్లో పాఠ్యాంశంగా చేస్తే బాగుంటుంది: జనసేన యాదవ్

*జివిఎంసి కార్పొరేటర్, జనసేన పక్షనేత మూర్తి యాదవ్ సూచన*

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 23,  2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలు మాట్లాడే భాషను పాఠశాలలు, కళాశాలల్లో పాఠ్యాంశంగా పెట్టి, భావి తరాలకు కూడా నేర్పిస్తే బాగుంటుందని, గ్రేటర్ విశాఖపట్నం

మున్సిల్ కార్పొరేషన్ లో జనసేన పక్ష నేత పీతల మూర్తి యాదవ్ సూచించారు. ఇరు పార్టీలలోని అగ్రస్థాయి నాయకులూ, గౌరవ ప్రదమైన పదవుల్లో ఉన్నవారు నేరుగా మీడియా మాధ్యమంగా మాట్లాడుతున్న భాష సమాజం లోని పౌరులు సిగ్గుపడేలావుందన్నారు. అధికారం కోసం ఒకరు, అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం లో మరొకరు ఇబ్బడి ముబ్బడిగా దూషణల

పర్వాన్ని విశృంఖలంగా వాడుతున్నారన్నారు. అయితే తప్పని సరి పరిస్థితుల్లో మీడియా సంస్థలు వీటిని ప్రసారం చెయ్యవలసినప్పుడు సిగ్గుపడుతున్నాయన్నారు. 

దాదాపుగా ఇద్దరు వాడుతున్న భాష ఇంచుమించు ఒకేలా ఉన్నప్పడికి కేవలం ప్రతిపక్ష పార్టీల వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ పరిస్థితుల్లో అసలు ఎవరి భాష

సంప్రదాయబద్ధంగా ఉంది, ఎవరి భాష అసభ్యకరంగా ఉందొ ప్రజలు తెలుసుకోలేని స్థితి కలుగుతోందన్నారు. 

ఈ క్రమంలో ఈ భాషలను పాఠశాల స్థాయి నుంచి, కళాశాల స్థాయి వరకూ ఈ రాజకీయ పార్టీల భాషలపై ఒక సిలబస్ ను పెట్టి, తరగతులు పెట్టి విద్యార్థులకు నేర్పిస్తే. .. భవిష్యత్ లో ఈ విద్యార్థులు ఉత్తమ ప్రజా ప్రతినిధులుగా

తయారవుతారన్నారు. ఈ సిలబస్ ను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లల్లో తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. చట్టాలు చసే ఈ నాయకులు వాళ్లు ఉపయోగిస్తున్న భాషను పాఠ్యాంశాలుగా మా రిస్థీ వల్ల పేరు భావి తరాలకు గర్తు గా వుంటుంది కదా

ఈ భాష అభ్యంతరకరంగా ఉంది అని భావించినట్టయితే ఈ భాష ను

వినియోగించేవారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదో వివరించాలని కోరారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam