DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎంపీ అయినా, ఆర్ఎస్ఎస్ పదసంచాలన్‌లో సామాన్యుని కార్యకర్తే..

*పద సంచాలన్‌ లో బీజేవైఎం అధ్యక్షులు ఎంపీ తేజస్వి సూర్య*

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 24,  2021 (డిఎన్ఎస్):* ఆ యువకుడు అధికార భారతీయ జనతా  పార్టీకి చెందిన ఒక ఎంపీ, అందునా అదే పార్టీకి చెందిన యువమోర్చ జాతీయ అధ్యక్షుడు . . అయినా సామాన్య కార్యకర్తలాగానే పద సంచాలన్‌లో పాల్గొన్నారు. ఈ దృశ్యం

బెంగుళూరు లోని  కోరమంగళలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్ఎస్ఎస్ ) జయనగర్ భాగ్ నిర్వహించిన నిర్వహించిన పద సంచాలన్‌లో కనిపించింది. బెంగుళూరు దక్షిణ లోక్ సభ స్థానం సభ్యులు తేజస్వి సూర్య ఆదివారం ఉదయం శాఖ కు వందలాది సంఘ కార్యకర్తలతో పాటు పాల్గొన్నారు. ఎక్కడా ప్రోటోకోల్ కనపడలేదు, తెల్ల చొక్కా, ముక్కుపొడుం రంగు

ప్యాంట్ ధరించి, ఒక కర్రను చేతబూని, నమస్తే సదావత్సలే. . .గీతం ఆలాపన జరుగుతుంటే. . .సామాన్య కార్యకర్తలాగానే భగ్వా  ధ్వజ్ లో పాల్గొన్నారు. అందరిలాగానే అల్పాహారం తీసుకున్నారు. 
ఆర్ ఎస్ ఎస్ సంస్థలో ఎటువంటి ప్రోటోకాల్ పాటించడం ఉండదు. ఎంత పెద్ద హోదాలో  ఉన్నవారైనా సరే సామాన్య కార్యకర్తలతో కలిసి శాఖలో పాల్గొనవలసి

ఉంటుంది. అదే క్రమ శిక్షణ తొలినాళ్ళ నుంచీ అమలు లో ఉంది. ముందు క్రమశిక్షణ, ఆ తర్వాతే పదవులు  హోదాలు అన్నీనూ అనే  సిద్ధాంతాన్ని అన్ని స్థాయిల్లోనూ పాటించడం జరుగుతుంది. అందుకే దేశ విదేశాల్లో ఆర్ఎస్ఎస్ పట్ల గౌరవం వ్యక్తమవుతోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam