DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో ఈనెల 26 నుంచి నిఘా వారోత్సవాలు

*(DNS Report : Ganesh. BVS, Staff Reporter, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 25,  2021 (డిఎన్ఎస్):* అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకూ వారం రోజుల పాటు నిఘా వారోత్సవాలు జరపాలనే సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ (సివిసి) ఇచ్చిన అదేశాల మేరకు విశాఖపట్నం పోర్టు ట్రస్టు ఆధ్వర్యంలో వారోత్సవాలను జరిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు విశాఖపట్నంపోర్టు ట్రస్టు చీఫ్

విజిలెన్స్ కమిషనర్ జె. ప్రదీప్ కుమార్ వెల్లడించారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఈ ఏడాది ఇండిపెండెంట్ ఇండియా @75 సెల్ఫ్ రిలయన్స్ విత్ ఇంటిగ్రిటి ధీమ్ తో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వారోత్సవాలను జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా పారదర్శకత, జవాబుదారీ తనం, న్యాయము మరియు అవినీతి రహిత

పాలన పై ప్రజలకు అవగాహన కల్పించేలా తద్వారా పాలనా వ్యవస్ధలను మెరుగుపరిచే విధంగా వారోత్సవాల్లో కార్యక్రమాలను రూపొందించారు.

సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ ఆదేశాలను అనుసరించి విశాఖపట్నం పోర్టు ట్రస్టు పరిధిలో పలు కార్యక్రమాలను రూపొకల్పన చేశారు. ఇందులో భాగంగా పోర్టు వాటాదారులు(స్టేక్ హోల్డర్స్), ఉద్యోగులు,

నగరవాసులు ముఖ్యంగా యువతకు సంస్కృతి, నిజాయితీ, సమగ్రత లను పాటించడం తద్వారా    నైతిక విలువల పరిరక్షణ ఏ విధంగా కొనసాగించవచ్చు అనే అంశాలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.  వారం రోజుల పాటు అయా అంశాలపై అవగాహన కల్పించేలా పలు చర్యలు చేపట్టారు. దేశ అభివృద్దిలో అవినీతి అనేది ఏ విధంగా అటంకాలు

కల్గిస్తుంది అనే అంశంపై యువతకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలను రూపొందించారు.

సివిసి సూచనల ప్రకారం అంతర్గతంగా చేపట్టవలసిన కార్యక్రమాలకు ప్రధమ ప్రాధాన్యతను ఇస్తున్నట్లు విశాఖపట్నం పోర్టు చీఫ్ విజిలెన్స్ అధికారి ప్రదీప్ కుమార్ వెల్లడించారు. భూ నిర్వహణ,క్వార్టర్ల కేటాయింపు, ఆస్తుల నిర్వహణ, ఫిర్యాదుల

పరిష్కారం, తనిఖీలు వంటి కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి సారిస్తామని తెలిపారు. ఇక వారం రోజుల పాటు పోర్టు ఉద్యోగులను భాగస్వాములుగా చేస్తూ పలు అంశాలపై ఎస్సే రైటింగ్, క్విజ్ పోటీలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు ప్రారంభ కార్యక్రమంగా ఉద్యోగులతో ప్లెడ్జ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక పోర్టు

వ్యాపారస్తులతో సమావేశం, వ్యవస్ధ క్రమబద్దీకరణ వంటి అంశాలపై అయా వర్గాలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు చీఫ్ విజిలెన్స్ అధికారి వెల్లడించారు.

ఇక నవంబర్1న నిఘా వారోత్సవాల ముగింపు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చీఫ్ విజిలెన్స్ అధికారి జె. ప్రదీప్ కుమార్ వెల్లడించారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam