DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎయిడెడ్ స్కూళ్ళు అర్థంతరంగా మూయద్దు: జనసేన మూర్తి

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 26,  2021 (డిఎన్ఎస్):* విశాఖ జిల్లాలోని ఎయిడెడ్ కళాశాలలు ,  పాఠశాలలను ఎయిడెడ్ స్కూళ్ళు అర్థంతరంగా మూసివేయద్దని కోరుతూ  మహా విశాఖ నగర పాలక సంస్థ జనసేన పక్ష నేత పీతల మూర్తి యాదవ్ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డా. ఏ మల్లిఖార్జున కు వినతి పత్రం అందించారు. మంగళవారం ఆయన్ను

కలిసి ఎయిడెడ్ విద్యా సంస్థల్లో వేలాది మంది పేద  విద్యార్థుల విద్యాభ్యాసం చేస్తున్నారని, దాతల సాయంతో దశాబ్దాలుగా ఉచిత విద్య ఎయిడెడ్ విద్యా సంస్థల ద్వారా వీరికి అందుతున్నాయన్నారు.  
అయితే సరైన చర్చలు,  సంప్రదింపులు,  కసరత్తు  లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్  విద్యాసంస్ధలను  ప్రభుత్వంలో విలీనం

చేయాలన్న నిర్ణయం విద్యార్థులకు శాపంగా మారిందన్నారు. విద్యాసంస్థల ఆస్తులపై కన్నేసి విలీనానికి ప్రయత్నించటం పట్ల అభ్యంతరాలు వ్యక్తం మయ్యాయని ఆవేదన వ్యక్తం చేసారు. కోట్ల రూపాయల విలువ చేసే విద్యాసంస్థల భవనాలు ఆస్తులను ఇవ్వడానికి నిరాకరించిన విద్యాసంస్థల ఎయిడ్ ను ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. 
ఎయిడెడ్

ఉపాధ్యాయులు అధ్యాపకులను హడావిడిగా బదిలీ చేసేసింది. ఈ కారణంగా పలు విద్యాసంస్థలు తాము సంవత్సరాన్ని కొనసాగించాలేమంటూ పాఠశాలలు కళాశాలలను మూసివేశాయని తెలిపారు. 

దీంతో వేల మంది విద్యార్థులు. దిక్కులేని వారవుతున్నారు. విశాఖ నగరంలోని జ్ఞానాపురం  సీక్రెట్ హార్ట్, సెయింట్ పీటర్స్ పాఠశాలలు ప్రభుత్వ

నిర్లక్ష్య నిర్ణయం కారణంగా మూత పడి వేలాది మంది విద్యార్థులను రోడ్డుపాలు చేశాయన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు వేల సంఖ్యలో సోమవారం నాడు ఆరు గంటల పాటు రహదారి పై బైఠాయించి  నిరసన తెలియజేశారని వివరించారు. 
జిల్లా వ్యాప్తంగా ఇదే బాటలో వేలాది మంది ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను

బలవంతంగా విలీనం చేసే ప్రసక్తే లేదని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేస్తున్నా, క్షేత్ర స్ధాయిలో వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. 

విద్యాశాఖ అధికారులు ఎయిడెడ్ యాజమాన్యాలను భయపెట్టి విద్యాసంస్థల 
మూసివేతకు కారణమవుతున్నారు. వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విద్యా

సంవత్సరం పై ఎటువంటి ప్రభావం పడకుండా ఎయిడెడ్ పాఠశాలలు కళాశాలలు యధావిధిగా కొనసాగించటానికి చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి నివేదించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సింది గా కోరుతున్నామన్నారు. 
ఎయిడెడ్  సంస్థలు ప్రైవేట్ సంస్థల గా రూపాంతరం చెందితే పేద

విద్యార్థుల పై భారం పడే ప్రమాదం ఉంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యాసంస్థల్లో  ఇప్పడున్న ఫీజులనే కొనసాగేంచే  విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరు తున్నామన్నారు. 

ఎయిడెడ్ విద్యా సంస్థల్లోని ఉపాధ్యాయులు అధ్యాపకులు ప్రభుత్వ విద్యా సంస్థలకు బదిలీ చేయకుండా విద్యా సంవత్సరం ముగిసే వరకు అక్కడే

కొనసాగించాలని, ప్రభుత్వం నుంచి ఈ  విద్యా సంస్థలకు రావాల్సిన బకాయిలను కూడా యుద్ధ ప్రాతిపదికన చెల్లించాలని కోరుతున్నామన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam