DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో నిఘా వారోత్సవాలు ప్రారంభం.* 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 26,  2021 (డిఎన్ఎస్):* కేంద్ర చీఫ్ విజిలెన్స్ కమీషన్ (సివిసి) ఆదేశాల ప్రకారం విశాఖపట్నం పోర్టు ట్రస్టు విజిలెన్స్ అధికారులు నిఘా వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. విశాఖపట్నం పోర్టు ట్రస్టు పరిపాలనా భవనంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా పోర్టు

చైర్మన్ కె.రామమోహనరావు, పోర్టు ఉద్యోగులతో విజిలెన్స్ ప్రతిజ్ఞ చేయించారు.

మంగళవారం ప్రారంభమైన నిఘా వారోత్సవాలు వారం రోజుల పాటు జరగనున్నాయి. నవంబర్ 1న వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నిఘా వారోత్సవాల్లో భాగంగా విజిలెన్స్ అధికారులు విశాఖ వాసులలో అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలకు

రూపకల్పన చేశారు. కోవిడ్ 19 నిబంధనలకు  అనుగుణంగా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. అవినీతిని నిరోధించడానికి యువతకు దానిపైన అవగాహన కల్పించడం ముఖ్యమని భావించి యువతకు అవగాహన కల్పించే కార్యక్రమాలను వారోత్సవాల్లో భాగంగా నిర్వహించనున్నారు. ఇక వారోత్సవాల్లో భాగంగా వివిధ అంశాలపై ఉద్యోగులకు వ్యాసరచన, వకృత్వ పోటీలను

 నిర్వహించనున్నారు. గెలుపొందిన విజేతలకు ముగింపు కార్యక్రమం రోజున బహుమతులు ప్రధానం చేయనున్నారు.

 ఈ కార్యక్రమంలో పోర్టు కార్యదర్శి టి. వేణుగోపాల్, విభాగాధిపతులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని నిఘా ప్రతిజ్ఞ చేశారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam