DNS Media | Latest News, Breaking News And Update In Telugu

28 నుంచి అయ్యప్ప మాల ధారులకు అన్నప్రసాద వితరణ 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 27,  2021 (డిఎన్ఎస్):* శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహిస్తున్న మండల కాల అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ట్రస్ట్ ఫౌండర్, కోదండ రామాలయం కమిటీ ప్రతినిధి కడగల శ్రీను తెలిపారు.  దొండపర్తి

 వైర్లెస్ కాలనీ కోదండ రామాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడి జరగనున్న మండల కాల అన్నదాన వితరణ కార్యక్రమానికి మధ్యాహ్నం 12 గంటలకి ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ డీఆర్ఎం అనుప్ కుమార్ సేతపతి హాజరై ప్రారంభిస్తారని చెప్పారు. కోవిద్ నిబంధనలు అనుసరించి పరిమిత సంఖ్యలో మాల ధరించిన

అయ్యప్పలకు అన్నప్రసాదం అందించనున్నట్లు తెలియజేశారు. ఈ అవకాశాన్ని స్వాములు వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో ట్రస్ట్ అధ్యక్షుడు కంచుమూర్తి రమణమూర్తి, కార్యదర్శి ఎస్ శ్రీనివాస రావు, ఉపాధ్యక్షుడు కే కోటేశ్వరరావు, కోశాధికారి లక్ష్మీనారాయణ, ఆలయ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, స్వాములు గణేష్, రమేష్, అప్పారావు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam