DNS Media | Latest News, Breaking News And Update In Telugu

30 నుంచి రమ్య తిరుమలలో 68 రోజుల సుందరకాండ పారాయణ

*కొరోనా విముక్తి కోసం శ్రీకాకుళం ఆలయంలో నిత్య ఆరాధనలు* 
 
*(DNS Report : Acharyulu SV, Bureau Chief, Srikakulam)*

*శ్రీకాకుళం, అక్టోబర్ 28, 2021 (డిఎన్ఎస్):* గత ఏడాదిన్నర కాలంగా మానవాళిని ఇబ్బంది పెడుతున్న కొరోనా మహమ్మారి నుంచి సమాజానికి విముక్తి లభించాలి అనే సంకల్పంతో శ్రీకాకుళం లోని రమ్య తిరుమల ఆలయంలో 68 రోజుల పాటు సుందరకాండ పారాయణ

చేయనున్నట్టు అర్చకులు కరి వేణుమాధవ్ రంగనాధ్ తెలియచేసారు. ప్రతి రోజు 25 సర్గలు  పారాయణ చేయడం జరుగుతుందని, మొత్తం 68 రోజుల్లో పూర్తిగా 25 ఆవృతులు చేయడం జరుగుతుందన్నారు. 

గత ఏడాదిన్నర కాలంగా ఆలయంలో సుందరకాండ పారాయణ, శ్రీరామాయణ పునర్వసు పారాయణ, ప్రత్యేక ఆరాధనలు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 30 నుంచి జనవరి 5, 2022 వరకూ

నిర్విరామంగా సుందరకాండ 68 రోజుల పాటు జరుగుతుందని తెలిపారు. లోక కల్యాణార్థం జరుగుతున్న ఈ పారాయణ యజ్ఞం లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, తమ కోర్కెలు నెరవేర్చుకోవచ్చన్నారు. 

ఈ పారాయణలో పాల్గొని శ్రీ శ్రీనివాసుని, మహాలక్ష్మి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. 

విరాళాలు

అందించి ఆలయ అభివృద్ధి లో . .

శ్రీకాకుళం ప్రధాన రహదారి (అరసవల్లి వెళ్లే రోడ్డు) లో ఉన్న రమ్య తిరుమల ఆలయంలో  సెప్టెంబర్ 1 న నుంచి ఆలయ ముఖ ద్వారం నిర్మాణం వైభవంగా జరుగుతోందని, త్వరలోనే ముఖద్వారం నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. భక్తులు భూరి విరాళాలు అందించి ఆలయ అభివృద్ధి లో పాల్గొనవలసిందిగా కోరుతున్నారు.

వివరాలకు ఆలయ అర్చకులు రంగనాధ్ ను  నెంబర్ 94400 61940 లో సంప్రదించవచ్చన్నారు.  విరాళాలను ఫోన్ పే (నెంబర్: 94400 61940 ) ద్వారా గానీ,  యూనియన్ బ్యాంకు అకౌంట్ నెంబర్ :211112010000017 , IFSC కోడ్: UBIN 0821110  కు గానీ పంపవచ్చు అని తెలియచేసారు.   

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam