DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జిల్లా టిటి ప్రీమియర్ లీగ్ పోటీల విజేతలకు లక్ష నగదు

విశాఖపట్నం, ఆగస్టు 4 , 2018 (DNS Online ): విశాఖ జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యవం లో రెండవ సారి నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ పోటీలు విశాఖపట్నం నగరం లో ఘనంగా

ప్రారంభమయ్యాయి. శనివారం నగరం లోని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ గోల్డెన్ జూబిలీ మైదానం లోని రాజీవ్ గాంధీ ఇండోర్ మైదానం లో మొదలయ్యాయి. ఈ సందర్బంగా విశాఖపట్నం

జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం కార్యదర్శి శర్మ మాట్లాడుతూ రెండేళ్లుగా జిల్లా టేబుల్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ పోటీల విజేతలకు లక్ష

రూపాయల నగదు పురస్కారం అందిస్తున్నామని, మొత్తం ఆరు జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయని, ఒక్కొక్క జట్టులో ఏడుగురు సభ్యులు ఉంటారని తెలిపారు. వీరిలో సబ్ జూనియర్

స్థాయి క్రీడాకారుల నుంచి, జూనియర్, సీనియర్, వెటరన్, క్యాడెట్ ఇలా అన్ని స్థాయిల వాళ్ళు సభ్యులుగా ఉంటారన్నారు. ఈ పోటీలలో పాల్గొనడం ద్వారా జూనియర్ స్థాయి

క్రీడాకారులకు మంచి అనుభవం వస్తుందని, తద్వారా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ప్రస్తుతం ఉన్న తమ ర్యాంకులను మెరుగుపరుచుకుని అవకాశం ఉంటుందన్నారు. జిల్లా సంఘం

తరపున వివిధ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న జూనియర్, సీనియర్ క్రీడాకారులు పతకాలు సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఈ పోటీలను ఆదరిస్తున్న స్పాన్సరర్లు,

ఫ్రాంచైజీలకు ధన్యవాదములు తెలియచేసారు. వీరందరి సహకారంతోనే తాము à°ˆ విధమైన పోటీలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నామన్నారు. 

 

#dns #dns news #dnsnews #dns media #dnsmedia #dnslive #dns live #tt #table tennis #viskhapatnam #vizag #visakhapatnam district #visakhapatnam district table tennis

association

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam