DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమస్యలపై నిరుద్యోగ యువత రాష్ట్ర వ్యాప్త ఓదార్పు యాత్ర

*విశాఖపట్నం, అక్టోబర్ 29,  2021 (డిఎన్ఎస్):* నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులపై , విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రయివేటీకరణ కాకుండా రక్షించమని, ఇతర సమస్యలపై  అభిప్రాయ సేకరణ కోసం ఏపీ 13 జిల్లాల్లో ఓదార్పు యాత్ర చేస్తూన్నట్టు ఏపీ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధుల బృందం తెలిపింది. రాష్ట్రంలో నిరుద్యోగులు పడుతున్న

 ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు బ్యానర్ ను శుక్రవారం సిబిఐ విశ్రాంత అధికారి వివి లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. జెడి మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు వస్తేనే అభివృద్ధి ప్రారంభం అవుతుందన్నారు. 

గనులు కేటాయించాలని, రాష్ట్ర విభజన రాజ్యాంగ ఉల్లంఘనే కాబట్టి జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తూ,

ప్రత్యేక హోదా, రైల్వేజోన్ ఇవ్వలేదు గనుక విభజన చట్టం ని రద్దు చేయమని, ఇతర సమస్యలను పరిష్కరించమని జరుగుతున్నా ఈ యాత్ర ఫలప్రదం కావాలని అభిలాషించారు.  

ఈ కార్యక్రమంలో హేమంతకుమార్, విజయ్ రఘునాథ భట్ల, ప్రసాద్, కృష్ణమోహన్, తిరుపతిరావు, పెద్దబాబు, గాయత్రి, చాగంటి రమేష్, కృష్ణ మోహన్, నూకరాజు, పైలా నలిని, మురళి ,తోట

చిరంజీవి నాయుడు , రామకృష్ణ పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam