DNS Media | Latest News, Breaking News And Update In Telugu

31 న విశాఖ స్టీల్ ఉద్యమంలో పవన్ సభకు అనుమతి నో

*ప్లాంట్ ప్రయివేట్ కు ప్రభుత్వం ఒప్పేసుకుందా? :జనసేన*  

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 29,  2021 (డిఎన్ఎస్):* విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కు వ్యతిరేకంగా జరుగుతున్నా ఉక్కు పోరాట సమితి నిరసన సభలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభ కు అనుమతి ఇవ్వకపోవడాన్ని జివిఎంసి

జనసేన పక్ష నేత పీతల మూర్తి యడం మండిపడ్డారు. ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తూ అయన ఈనెల 31 న విశాఖ వస్తున్నట్టు ప్రకటించారు. దీనికై పొలిసు విభాగం అనుమతి కోసం జనసేన పార్టీ నేతలు విశాఖ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని శుక్రవారం ప్రత్యక్షంగా సంప్రదించారు. అయితే ఈ సభకు తాము అక్కడ అనుమతి ఇవ్వలేమని, వేరొకచోట ఖాళీ మైదానంలో

ఎక్కడైనా పెట్టుకోవాలి అంటూ సూచించడం తో జనసేన నేతలు మండిపడుతున్నారు. 

ఈ ఉద్యమం తమ పార్టీ కోసం కాదని, రాష్ట్ర ప్రజల మనోభావాలకు మద్దతు గా అన్ని వర్గాల ప్రజలు చేస్తున్న ఉద్యమం అన్నారు. దీనికి అనుమతి ఇవ్వకపోవడం బట్టి రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను సంపూర్ణంగా అంగీకరిస్తున్నట్టు

తేలిందన్నారు. ప్లాంట్ నిరసన సభ దగ్గర కాకుండా వేరోచోట సభ పెట్టుకునేలా అయితే పవన్ కళ్యాణ్ విశాఖ రావలసిన అవసరం ఉండేది కాదన్నారు. నేరుగా బాధితులకు సంఘీభావం తెలిపేందుకు దీక్ష స్థలికి రావాల్సిన ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. 

సభ అనుమతి కోసం పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని కి వెళ్లిన వారిలో మూర్తి

యాదవ్, జనసేన ప్రధాన కార్యదర్శులు  టి. శివశంకర్, బొలిశెట్టి సత్యనారాయణ, పీఏసీ సభ్యులు కోన తాతారావు, తదితరులు ఉన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam