DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పవన్ విశాఖ ఉక్కు ఉద్యమ సభకు పోటెత్తిన జనం 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 31,  2021 (డిఎన్ఎస్):*

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటైజేషన్ చేయడం కూడదని డిమాండ్ తో గత కొన్ని నెలలుగా ఉద్యమిస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఉద్యమ కారులకు సంఘీభావం తెలియ చేయడానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. ఆదివారం

మధ్యాహ్నం విశాఖ స్టీల్ ప్లాంట్ కూర్మన్నపాలెం గేటు దగ్గర ఉద్యమ శిబిరం వద్ద ఆయన ఉద్యమకారులకు సంఘీభావం తెలియజేశారు. ఆయన సభను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలాదిగా జనం రావడంతో గాజువాక అనకాపల్లి మార్గం జన సందోహం గా మారిపోయింది. విశాఖ విమానాశ్రయం నుంచి సభ వేదిక వరకూ రోడ్డు ఇరువైపులా భారీ ఎత్తున జనం స్వాగతం పలికారు.

ఓపెన్ టాప్ కారులో అభిమానులకు దారిపొడుగునా అభివాదం చేసుకుంటూ సభకు చేరుకున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam