DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పవన్ గారూ.. వీళ్ళు మీ కార్పొరేటర్లే నని . మీకు తెలుసా?

*జివిఎంసి కార్పొరేటర్లు ఎవరో అధినేతకు పరిచయం లేదా*

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 01,  2021 (డిఎన్ఎస్):* గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ లో జనసేన పార్టీ తరపున ముగ్గురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీళ్ళు ఎవరో జనానికి తెలుసు తప్ప, జనసేన

అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి తెలిసినట్టు లేదు. 
ఇదే విషయం ఈ కార్పొరేటర్ ల క్యాడర్ తెలియచేస్తున్నారు. తమ నాయకులూ ఘన విజయం సాధించిన నాటి నుంచి నేటి వరకూ తమ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసే అవకాశమే ఇవ్వలేదన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమం కోసం సంఘీభావం తెలిపేందుకు జనసేనాని ఆదివారం విశాఖ కు వచ్చి రెండు రోజుల పాటు సమావేశం

కానున్నారు. 

జనసేన పార్టీ ఉన్నత శ్రేణి నాయకులూ ఇంతవరకూ ఈ ముగ్గురు కార్పొరేటర్లకు ఇవ్వవలసిన కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదనే ఆవేదన అందరిలోనూ ఉంది. నిన్నటి సభ లో సైతం స్థానిక కూర్మన్నపాలెం ప్రాంత కార్పొరేటర్ దల్లి గోవిందా రెడ్డి జనసేన కు చెందిన వ్యక్తి కావడం గమనార్హం. కనీసం ఆదివారం నాటి పవన్ కళ్యాణ్ సభ

పై ఏర్పాట్ల సమాచారం కూడా వీళ్ళకి ఇవ్వకపోవడం కొసమెరుపు.

అత్యంత క్లిష్టమైన జీవీఎంసీ పోరులో ఘవినయం సాధించిన ఈ ముగ్గురికి తగిన గౌరవం ఇవ్వకపోతే. . ఇక జనంలో పార్టీ పట్ల నమ్మకం ఎలా కలుగుతుంది, అనే సందేహాలు వస్తున్నాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam