DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దమ్ముంటే పవన్ సవాల్ ను స్వీకరించండి: జనసేన మూర్తి 

*(DNS Report : Ganesh. BVS, Staff Reporter, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 01,  2021 (డిఎన్ఎస్):* రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు, ప్రజా ప్రతినిధులకు దమ్ముంటే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ సభలో విసిరిన సవాల్ ను స్వీకరించాలని మహా విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ( జివిఎంసి ) కౌన్సిల్

లో జనసేన పక్షనేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేసారు. సోమవారం విశాఖ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఆంధ్రుల హక్కు గా ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ ముప్పు నుంచి రక్షించేందుకు నడుం బిగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను  అభినందించి మద్దతు ప్రకటించాల్సింది పోయి అందుకు విరుద్ధంగా

అధికార వైసిపి నేతలు విరుచుకు పడటం విడ్డూరంగా ఉందని  మండిపడ్డారు. 

విశాఖ ఉక్కు కోసం 151 మంది ఎమ్మెల్యే లు, పాతిక మందికి పైగా ఎంపీలు ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఒత్తిడి చెయ్యక పోవడం వల్లే ప్రైవేటీకరణ కసరత్తు జోరుగా సాగుతోందన్నారు. 
కర్మాగారం ఉద్యోగులు నిర్వాసితులతో పాటు ఆంధ్ర ప్రదేశ్

ప్రజలంతా ముక్త కంఠం గా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారున్నారు. వారితో గళం కలిపేందుకు ముందుకొచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు విశాఖలో అనూహ్య మద్దతు లభించిందన్నారు. ఇది చూసి ఓర్వలేని వైసీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారన్నారని మండిపడ్డారు. 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం పై

నెట్టేస్తు,  ఇక్కడ వీళ్ళు, గంగవరం పోర్టు వాటాలను ఎందుకు అమ్మేశారో చెప్పాలన్నారు.  

ఆదివారం పవన్ సభ వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన అనకాపల్లి శాసనసభ్యుడు  గుడివాడ అమర్నాథ్ తీరు గురివింద గింజలా ఉందన్నారు. 

అధికారంలోకి వచ్చిన వెంటనే దసపల్లా భూములపై  సిబిఐ విచారణ వేయిస్తా అని ప్రగల్భాలు పలికిన

అమర్ ఆ భూములను తమ నేతలే కబ్జా చేస్తుంటే ఎందుకు నోరెత్తలేదన్నారు. విశాఖలో భూకబ్జాలు దందాలపై సెట్ నివేదికను ఎందుకు బయట పెట్ట లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 
ఈ సమావేశంలో 64వ వార్డు జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద రెడ్డి పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam