DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళా అభ్యున్నతిలో సర్వారాయ హరికథ పాఠశాల మేటి 

*కపిలేశ్వరపురం పాఠశాల కు వైఎస్సార్ సాఫల్య పురస్కారం* 

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  
 
*అమరావతి, నవంబర్ 01,  2021 (డిఎన్ఎస్):* నడిచే దేవునిగా కొనియాడబడిన కపిలేశ్వర పురం జమిందార్ చే 48 ఏళ్ళ క్రితం స్థాపించబడిన సర్వారాయ హరికథ పాఠశాల (మహిళలు) కు వైఎస్సార్ సాఫల్య పురస్కారం లభించింది. 

కళలు-

సంస్కృతీ విభాగంగా సర్వారాయ హరికథ పాఠశాల (మహిళలు) కు వైఎస్సార్ జీవన పురస్కారం ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పాఠశాల కరస్పాండెంట్ రామాచారా మూర్తి కి అందించారు. ఇదే వేదికపై ఆశీనులైన రాష్ట్ర గవర్నర్ హరిచందన విశ్వభూషణ్, వైఎస్ విజయ లక్ష్మి లు సంస్థ ప్రతినిధులను అభినందించారు.  

తూర్పు

గోదావరి జిల్లాలోని కపిలేశ్వర పురం లో జమిందార్ ప్రస్తుత తరాలకు చిరపరిచితులైన ఎస్.బి.పి. బి.కే. సత్యనారాయణరావు చే 1973 సంవత్సరంలో ఒకేసారి  రెండు విద్యా సంస్థలను ప్రారంభించారు.  శ్రీ సర్వారాయ హరికథా పాఠశాల మరియు పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న అయన స్వగ్రామం కపిలేశ్వరపురంలో శ్రీ సర్వారాయ వేద పాఠశాలలను ప్రారంభించారు.

సంస్కృత హరికథలు కూడా ఇక్కడ బోధిస్తారు.  వేదపాఠశాల బాగా పనిచేస్తోంది మరియు దాని ప్రస్తుత 34 మంది విద్యార్థులు కృష్ణ యాజుర్వేద (తైత్తరీయ శాఖ) మరియు అధర్వ వేద (శౌనకీయ శాఖ) శిక్షణ పొందుతున్నారు. 

హరికథ పాఠశాల లో మహిళలకు ప్రత్యేక శిక్షణ అందిస్తూ, ఎన్నో విజయాలు సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం చే గుర్తించబడి,

ప్రభుత్వ పధకాలను అందిస్తూ, బాలికలు, మహిళల అభ్యున్నతికి పురోగమన స్థితికి చేరుకుంది. 

సంస్థ వ్యవస్థాపకులు ఎస్.బి.పి. బి.కే. సత్యనారాయణరావు జన్మ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఇదే సంవత్సరం ( సెప్టెంబర్ 23, 2021 ) లో ఆయన స్థాపించిన పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం లభించడం గమనార్హం.    
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam